E-Paper
Advertisement

Jagtial: జగిత్యాల జిల్లాలో వ్యక్తి అనుమానాస్పద మృతి.. గుప్త నిధుల కోసం నరబలి ఇచ్చారని స్థానికుల ఆరోపణలు!

Jagtial: జగిత్యాల జిల్లాలో వ్యక్తి అనుమానాస్పద మృతి.. గుప్త నిధుల కోసం నరబలి ఇచ్చారని స్థానికుల ఆరోపణలు!
Advertisement

Jagtial: జగిత్యాల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి అనుమానాస్పద రీతిలో మరణించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. జగిత్యాల రూరల్ మండలం అనంతారం గ్రామానికి చెందిన నారవేణి మొగిలి  అనే వ్యక్తి మృతి చెందగా, ఈ మరణంపై అతని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదని, గుప్త నిధుల కోసం ఉద్దేశపూర్వకంగా నరబలి ఇచ్చారని వారు ఆరోపిస్తుండటం సంచలనంగా మారింది.

మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… అనంతారం గ్రామానికి చెందిన మొగిలిని, సమీపంలోని గోవిందుపల్లె గ్రామానికి చెందిన సోమయ్య అనే వ్యక్తి శనివారం ఉదయం సుతారీ పని (మేస్త్రీ పని) నిమిత్తం తన వెంట తీసుకెళ్లాడు. అయితే, కొంత సమయం తర్వాత, పని చేస్తున్న ప్రదేశంలో మొగిలికి ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలిందని, వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తున్నామని సోమయ్య, మృతుడి కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. కానీ, ఆ తర్వాత జరిగిన పరిణామాలు, గ్రామస్తుల ద్వారా తెలిసిన విషయాలు వారి అనుమానాలకు బలం చేకూర్చాయి.

Advertisement

Read Also: Crime News: దారుణం.. ఆస్తి కోసం కన్న తల్లిని హత్య చేసిన కసాయి కొడుకు..

ఈ ఘటనపై గ్రామస్తులు భిన్నమైన, షాకింగ్ వాదనలు వినిపిస్తున్నారు. సోమయ్య చెప్పిన ‘కరెంట్ షాక్’ కథనాన్ని వారు ఏమాత్రం నమ్మడం లేదు. అసలు విషయం వేరే ఉందని వారు ఆరోపిస్తున్నారు. సోమయ్య, రాజేశ్ అనే మరో వ్యక్తి, మరియు మృతుడు మొగిలి… ఈ ముగ్గురూ బీర్​పూర్ మండలం కండ్లపల్లి గ్రామంలోని ఓ మహిళ ఇంట్లో ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఆ ఇంటి ఆవరణలో కొత్తగా ఓ పెద్ద గుంత తవ్వి ఉందని, దాని పరిసరాల్లో పసుపు, కుంకుమ, నిమ్మకాయలు వంటి వస్తువులు పడి ఉన్నాయని, అక్కడ క్షుద్ర పూజలు, తాంత్రిక పూజలు చేసిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపించాయని వారు ఆరోపించారు. గుప్త నిధుల కోసమే ఈ పూజలు నిర్వహించి, అందులో భాగంగానే అమాయకుడైన మొగిలిని వారు నరబలి ఇచ్చి ఉండవచ్చని గ్రామస్తులు బలంగా అనుమానిస్తున్నారు.

Advertisement

పని పేరుతో నమ్మించి తీసుకెళ్లి, పథకం ప్రకారం హత్య చేశారని వారు ఆరోపిస్తున్నారు. మరణించిన మొగిలికి భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి మరణంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ అనుమానాస్పద మృతిపై పోలీసులు సమగ్ర విచారణ జరపాలని, ముఖ్యంగా నరబలి, గుప్త నిధుల కోణంపై లోతుగా దర్యాప్తు చేసి, నిజానిజాలు నిగ్గు తేల్చాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అమాయకుడైన మొగిలి చావుకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించి, బాధిత కుటుంబానికి తక్షణమే న్యాయం చేయాలని వారు ముక్తకంఠంతో కోరుతున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.

 

 

 

Related News

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

Big Stories

Advertisement
×