E-Paper
Advertisement

Blood Donation : ఆపద వేళ కదిలిన యువతరం.. రక్తదానం చేసేందుకు ఆస్పత్రుల వద్ద బారులు..

Blood Donation : ఆపద వేళ కదిలిన యువతరం.. రక్తదానం చేసేందుకు ఆస్పత్రుల వద్ద బారులు..

BLOOD DONATION : ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో మూడు రైళ్లు ఢీ కొన్న ప్రమాదం వందల కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. ఈ విపత్కర పరిస్థితుల్లో స్థానికులు మానవత్వాన్ని చూపించారు. గాయపడిన వారికి రక్తం అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.

బాలేశ్వర్‌ సమీపంలోని బహానగా బజార్‌ వద్ద జరిగిన రైలు దుర్ఘటనలో దాదాపు 900 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను బాలేశ్వర్‌ లోని ప్రభుత్వ ఆసుపత్రితోపాటు సమీప ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారు అక్కడే చికిత్స పొందుతున్నారు. చాలామంది యువకులు శుక్రవారం రాత్రే బాలేశ్వర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి వద్ద వచ్చారు. రక్తదానం చేస్తామంటూ స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. గంటల తరబడి లైన్లలో వేచి ఉన్నారు. క్షతగాత్రులకు రక్తదానం చేస్తున్నారు.

ప్రమాదం జరిగిన తర్వాత స్థానికులు వేగంగా స్పందించారు. ఘటనాస్థలానికి చేరుకున్నారు. వెంటనే సహాయకచర్యలు చేపట్టారు. బోగీల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. తాము దాదాపు 300 మందిని కాపాడామని స్థానికులు తెలిపారు.

ఘటనాస్థలిలో సైన్యం సహాయకచర్యలు కొనసాగిస్తోంది. బోగీల కింద చిక్కుకున్న వారిని బయటకు తీస్తోంది. వారిని ఆసుపత్రులకు తరలించేందుకు 200 అంబులెన్స్‌ లను అందుబాటులో ఉంచారు. ఇందులో 167 .. 108 వాహనాలు , 20 ప్రభుత్వ అంబులెన్స్‌లు ఉన్నాయి. 45 మొబైల్‌ హెల్త్‌ బృందాలు ఘటనాస్థలంలోనే సేవలు అందిస్తున్నాయి.

Tags

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×