E-Paper
Advertisement

Train Accidents : రైల్వే చరిత్రలో ఘోర ప్రమాదాలు.. అతి పెద్ద దుర్ఘటన ఇదేనా..?

Train Accidents : రైల్వే చరిత్రలో ఘోర ప్రమాదాలు.. అతి పెద్ద దుర్ఘటన ఇదేనా..?
Advertisement

Train Accidents in India(Morning news today telugu) : ఒడిషాలో జరిగిన రైలు దర్ఘటన భారత రైల్వే చరిత్రలో అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది. గతంలో ఎన్నో విషాదకర ఘటనలు జరిగాయి. 1981లో బిహార్‌లోని సహస్ర వద్ద ఓ ప్యాసింజర్‌ రైలు పట్టాలు తప్పింది. ఈ రైలు భాగమతి నదిలో మునిగిపోయింది. దీంతో 500 మంది మృత్యువాతపడ్డారు. భారత్ లో ఓ రైలు ప్రమాదంలో ఇంతమంది చనిపోవడం అదే మొదటిసారి. 1995లో ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌ వద్ద ఢిల్లీ వెళుతున్న పురుషోత్తమ్‌ ఎక్స్‌ప్రెస్‌.. కలిండ్‌ ఎక్స్‌ప్రెస్‌ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 358 మంది ప్రాణాలు కోల్పోయారు.

1999లో అసోంలోని గైసోల్‌ వద్ద రెండు ప్యాసింజర్‌ రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 290 మంది చనిపోయారు. ప్రమాద తీవ్రతకు పేలుడు కూడా సంభవించింది. 1998లో కోల్‌కతా వెళుతున్న సమయంలో జమ్ముతావి ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. పక్క ట్రాక్ పై వెళ్తున్న గోల్డెన్‌ టెంపుల్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 212 మంది ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

2002లో హౌరా నుంచి న్యూఢిల్లీ వెళుతున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 140 మంది మృతిచెందారు. 2010లో హౌరా నుంచి ముంబై వెళుతున్న లోకమాన్య తిలక్‌ – జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్‌ రైలు.. పేలుడు వల్ల పట్టాలు తప్పి గూడ్స్‌ రైలును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 170 మంది మృత్యువాతపడ్డారు.

2016లో ఇండోర్‌ నుంచి పట్నా వెళుతున్న ఎక్స్‌ప్రెస్‌ కాన్పూర్‌ సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 150 మంది చనిపోయారు. 2005లో తెలంగాణలోని వలిగొండ వద్ద ఒక్కసారిగా వచ్చిన వరదకు రైలు వంతెన కొట్టుకుపోయింది. దీంతో డెల్టా ప్యాసింజర్‌ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 114 మంది దుర్మరణం చెందారు. ప్రస్తుతం కోరమండల్ ఎక్స్ ప్రెస్ ఘటనలో ఇప్పటికే 280 మంది మృతి చెందగా.. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.

Related News

పిల్లలను రెచ్చగొట్టొద్దు..లీక్ ఘోర పాపం, నీట్‌పై నోరు విప్పిన ప్రధాని మోదీ

పాపం ఊరికే పోదు.. నీట్ లీక్ వెనకున్న వారిని వదిలేదే లేదు: ప్రధాని మోదీ

హస్తిన వైపు కదం తొక్కిన రైతన్నలు.. శంభు బార్డర్ వద్ద హైటెన్షన్, అడ్డుకున్న పోలీసు బలగాలు, ఎందుకు?

పని లేదు.. సగం జీతమే ఇవ్వండి: IAS లేఖ

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

Big Stories

Advertisement
×