E-Paper
Advertisement

Train Accidents : రైల్వే చరిత్రలో ఘోర ప్రమాదాలు.. అతి పెద్ద దుర్ఘటన ఇదేనా..?

Train Accidents : రైల్వే చరిత్రలో ఘోర ప్రమాదాలు.. అతి పెద్ద దుర్ఘటన ఇదేనా..?

Train Accidents in India(Morning news today telugu) : ఒడిషాలో జరిగిన రైలు దర్ఘటన భారత రైల్వే చరిత్రలో అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది. గతంలో ఎన్నో విషాదకర ఘటనలు జరిగాయి. 1981లో బిహార్‌లోని సహస్ర వద్ద ఓ ప్యాసింజర్‌ రైలు పట్టాలు తప్పింది. ఈ రైలు భాగమతి నదిలో మునిగిపోయింది. దీంతో 500 మంది మృత్యువాతపడ్డారు. భారత్ లో ఓ రైలు ప్రమాదంలో ఇంతమంది చనిపోవడం అదే మొదటిసారి. 1995లో ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌ వద్ద ఢిల్లీ వెళుతున్న పురుషోత్తమ్‌ ఎక్స్‌ప్రెస్‌.. కలిండ్‌ ఎక్స్‌ప్రెస్‌ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 358 మంది ప్రాణాలు కోల్పోయారు.

1999లో అసోంలోని గైసోల్‌ వద్ద రెండు ప్యాసింజర్‌ రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 290 మంది చనిపోయారు. ప్రమాద తీవ్రతకు పేలుడు కూడా సంభవించింది. 1998లో కోల్‌కతా వెళుతున్న సమయంలో జమ్ముతావి ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. పక్క ట్రాక్ పై వెళ్తున్న గోల్డెన్‌ టెంపుల్‌ ఎక్స్‌ప్రెస్‌ బోగీలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 212 మంది ప్రాణాలు కోల్పోయారు.

2002లో హౌరా నుంచి న్యూఢిల్లీ వెళుతున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 140 మంది మృతిచెందారు. 2010లో హౌరా నుంచి ముంబై వెళుతున్న లోకమాన్య తిలక్‌ – జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్‌ రైలు.. పేలుడు వల్ల పట్టాలు తప్పి గూడ్స్‌ రైలును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 170 మంది మృత్యువాతపడ్డారు.

2016లో ఇండోర్‌ నుంచి పట్నా వెళుతున్న ఎక్స్‌ప్రెస్‌ కాన్పూర్‌ సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 150 మంది చనిపోయారు. 2005లో తెలంగాణలోని వలిగొండ వద్ద ఒక్కసారిగా వచ్చిన వరదకు రైలు వంతెన కొట్టుకుపోయింది. దీంతో డెల్టా ప్యాసింజర్‌ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 114 మంది దుర్మరణం చెందారు. ప్రస్తుతం కోరమండల్ ఎక్స్ ప్రెస్ ఘటనలో ఇప్పటికే 280 మంది మృతి చెందగా.. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.

Related News

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

Bengal Politics: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు

చల్లని కబురు వచ్చేసింది.. కేరళలోకి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ, వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశం

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

Big Stories

×