BigTV English
Advertisement

Banana For Skin: అరటి పండుతో గ్లోయింగ్ స్కిన్

Banana For Skin: అరటి పండుతో గ్లోయింగ్ స్కిన్

Banana For Skin: పవర్ హౌస్ ఆఫ్ ఎనర్జీగా పిలువబడే అరటిపండు శరీరానికి మాత్రమే కాదు, చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది. అరటిపండును ముఖానికి అప్లై చేయడం ద్వారా ముఖంపై ఉన్న జిడ్డు తొలగిపోతుంది. అంతే కాకుండా మెరుపును తిరిగి పొందవచ్చు. ఇటువంటి లక్షణాలు అరటిపండులో ఉంటాయి. ఇవి చర్మంపై తేమను కలిగిస్తాయి. ఇది చర్మాన్ని మృదువుగా కాంతివంతంగా మారుస్తుంది.


అరటిపండులో ఉండే విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు చర్మానికి పోషణనిచ్చి ఆరోగ్యంగా ఉంచుతాయి. అరటిపండులో ఉండే పొటాషియం చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి మృదువుగా మార్చుతుంది. అరటిపండు వల్ల కలిగే లాభాలు అరటిపండుతో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చర్మానికి అరటిపండు వల్ల కలిగే ప్రయోజనాలు:


తేమను అందిస్తుంది:
అరటిపండు చర్మానికి లోతైన తేమను అందిస్తుంది. అంతే కాకుండా ఇది చర్మం పొడిబారకుండా, నిర్జీవంగా మారకుండా చేస్తుంది.
ముడతలను తగ్గిస్తుంది:
అరటిపండులో ఉండే విటమిన్ ఎ, ఇ చర్మంపై కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడతాయి. ఇది ముడతలను తగ్గించి చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
చర్మాన్ని మెరిసేలా చేస్తుంది:
అరటిపండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించి మెరుస్తూ ఉండేలా చేస్తాయి.
చర్మాన్ని శాంతపరుస్తుంది:
అరటిపండులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి చర్మానికి ఉపశమనం కలిగించి, మంటను తగ్గిస్తాయి.
మొటిమలను తగ్గిస్తుంది:
అరటిపండులో ఉండే విటమిన్ సి మొటిమలను కలిగించే బ్యాక్టీరియాతో పోరాడుతుంది. అంతే కాకుండా చర్మాన్ని శుభ్రపరుస్తుంది.

అరటిపండును ఎలా ఉపయోగించాలి ?

అరటిపండు ఫేస్ మాస్క్ :
పండిన అరటిపండును మెత్తగా చేసి ముఖానికి పట్టించాలి. 15-20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి.

అరటిపండు, తేనె ఫేస్ మాస్క్:
పండిన అరటిపండును మెత్తగా చేసి దానికి ఒక టీస్పూన్ తేనె కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల తర్వాత కడిగేయాలి. తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇది మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ముఖం అందంగా మారేందుకు ఉపయోగపడుతుంది. ముఖానికి తరుచుగా అరటిపండు గుజ్జును పెట్టడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.

Also Read: చెక్కరతో ఇలా చేస్తే ముఖం మెరిసిపోతుంది

అరటిపండు, పెరుగు ఫేస్ మాస్క్:
పండిన అరటిపండును మెత్తగా చేసి అందులో రెండు చెంచాల పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల తర్వాత కడిగేయాలి. పెరుగులో లాక్టిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇది చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది.

అరటిపండు, అలోవెరా జెల్ ఫేస్ మాస్క్:
పండిన అరటిపండును మెత్తగా చేసి దానికి రెండు చెంచాల అలోవెరా జెల్ కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15-20 నిమిషాల తర్వాత కడిగేయాలి. అలోవెరా జెల్ చర్మానికి తేమను అందిస్తుంది. ఇలా చేయడం వల్ల ముఖంపై చికాకు తగ్గిస్తుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Masala Vada: బండి మీద దొరికే మసాలా వడ.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్ట్ !

Hot Water: ఈ సమస్యలున్న వారికి వేడినీళ్లు హానికరం.. పొరపాటున కూడా తాగొద్దు!

Tomato Egg Curry: టమాటో ఎగ్ కర్రీ.. ఈ అద్భుతమైన రుచికి ఎవ్వరైనా అబ్బా అనాల్సిందే !

Glass Objects: ఇంట్లో గాజు వస్తువులు పగిలితే.. శుభమా ? అశుభమా ?

Radish in Winter: శీతాకాలంలో ముల్లంగి తినడం వల్ల ఏమవుతుందో తెలిస్తే షాక్ అవుతారు

Nonveg: చికెన్, మటన్ కర్రీ వండే ముందు వాటిని పెరుగు లేదా నిమ్మకాయతో మ్యారినేట్ చేస్తారెందుకు?

Worshipping God: నిద్రలేవగానే కరదర్శనం.. సానుకూల శక్తితో రోజును ప్రారంభించడానికి పునాది!

Tattoo: పచ్చబొట్లు తెగ వేసుకుంటున్నారా.. అయితే ఈ విషయాలు తప్పనిసరిగా తెలిసుండాలి!

Big Stories

×