BigTV English

Biyyampindi Pakoda: శెనగపిండితో కాకుండా ఓసారి బియ్యం పిండితో ఉల్లిపాయ పకోడీ ప్రయత్నించండి, రెసిపీ అదిరిపోతుంది

Biyyampindi Pakoda: శెనగపిండితో కాకుండా ఓసారి బియ్యం పిండితో ఉల్లిపాయ పకోడీ ప్రయత్నించండి, రెసిపీ అదిరిపోతుంది
Biyyampindi Pakoda: పకోడీ అనగానే శనగపిండితో చేసేదే అందరికీ గుర్తు వస్తుంది. ఇక్కడ మేము బియ్యప్పిండితో చేసే పకోడీ రెసిపీ ఇచ్చాము. ఇది క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది.  పకోడీ అంటే అందరికీ ఇష్టమే. దీన్ని శనగపిండితోనే ఎక్కువగా చేస్తారు. ఎప్పుడూ శెనగపిండితోనే కాదు బియ్యప్పిండితో కూడా ఓసారి పకోడీ చేసి చూడండి. ఇది టేస్టీగా ఉంటుంది. బియ్యప్పిండి ఉల్లిపాయ పకోడీ ఎలా చేయాలో ఇక్కడ రెసిపీ ఇచ్చాము. ఇది ఫాలో అయితే సాయంత్రం పూట సులువుగా క్రిస్పీ బియ్యం పిండి పకోడీ తయారు చేసుకోవచ్చు.


బియ్యప్పిండి పకోడీ రెసిపీకి కావలసిన పదార్థాలు
బియ్యప్పిండి – ఒక కప్పు
ఉప్పు – రుచికి సరిపడా
కరివేపాకులు – గుప్పెడు
కొత్తిమీర తరుగు – మూడు స్పూన్లు
జీలకర్ర – ఒక స్పూను
పచ్చిమిర్చి – మూడు
ఉల్లిపాయలు – రెండు

బియ్యప్పిండి ఉల్లిపాయ పకోడీ రెసిపీ
1. శెనగపిండికి బదులుగా బియ్యప్పిండిని ఈ పకోడీ తయారీ కోసం తీసుకోవాలి.
2. ఒక గిన్నెలో బియ్యప్పిండిని వేసేయాలి.
3. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేయాలి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి బాగా కలుపుకోవాలి.
4. ఉల్లిపాయల్లో ఉండే తేమకే ఈ బియ్యప్పిండి ముద్దలా తయారవుతుంది.
5. అలా కాకపోతే కొంచెం నీరు కలుపుకోండి.
6. అందులోనే పచ్చిమిర్చి తరుగును, కొత్తిమీర తరుగును, కరివేపాకు తరుగును కూడా వేసి బాగా కలపండి.
7. అలాగే జీలకర్రను కూడా వేసి బాగా కలపండి.
8. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి పకోడీ డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేయండి.
9. ఆ నూనెలో పకోడీలను వేసి వేయించుకోండి. ఇవి క్రిస్పీగా ఉంటాయి.
10. అవసరమైతే చిటికెడు వంటసోడాను కలుపుకోవచ్చు. ఇది చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి.
11. ఒకసారి ఈ బియ్యప్పిండి పకోడీ రెసిపీ ప్రయత్నించండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది.

Also Read: బెల్లం ముక్కను నెయ్యిలో ముంచి ప్రతిరోజూ తినమని చెబుతున్న పోషకాహార నిపుణులు, ఇలా తింటే ఏమవుతుంది?


బియ్యప్పిండితో కూడా మెత్తని పకోడీ, గట్టి పకోడీ రెండు రకాలుగా చేసుకోవచ్చు. పిండిని చాలా గట్టిగా కలిపితే గట్టి పకోడీ తయారవుతుంది. కాస్త పలుచగా కలుపుకుంటే మెత్తని పకోడీ వస్తుంది. మీకు ఎలా నచ్చితే అలా ఈ పకోడీని వండుకోవచ్చు.

బియ్యప్పిండితో చేసిన ఆహారాలు తినడం వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. దీనిలో కార్బోహైడ్రేట్లతో పాటు ఫైబర్ కూడా ఉంటుంది. కాబట్టి ఇది ఎక్కువ సేపు ఆకలి వేయకుండా అడ్డుకుంటుంది. అలాగే శారీరక శక్తిని కూడా అందిస్తుంది. గ్లూటెన్ అసహనంతో బాధపడే వారికి బియ్యప్పిండి వాడడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది. అలాగే పొట్ట వ్యాధులు ఉన్నవారికి, మలబద్ధకం ఉన్నవారికి కూడా బియ్యపు పిండితో చేసే వంటకాలు ఉపయోగపడతాయి. బియ్యప్పిండి పకోడీ చేసుకుని చూడండి. మీ అందరికీ నచ్చడం ఖాయం. శెనగ పిండి కన్నా బియ్యప్పిండి పకోడీ తింటేనే మంచిది. ఎందుకంటే శెనగపెట్టి కొందరిలో గ్యాస్టిక్ సమస్యలకు కారణం అవుతుంది. కానీ బియ్యప్పిండిలో గ్యాస్ ను ఉత్పత్తి చేసే సమ్మేళనాలు ఉండవు. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు రావు. బియ్యప్పిండి వల్ల బలంగా కూడా ఉంటారు. కాబట్టి అప్పుడప్పుడు బియ్యప్పిండి వంటకాలను చేసుకొని తినేందుకు ప్రయత్నించండి.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×