ఒక పిల్లి వైద్య రంగంలో నిపుణులకు ఆశ్చర్యపరిచింది. ఈ పిల్లి చేసిన అద్భుతాల కథలు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ పిల్లి ఒక వ్యక్తి ఎప్పుడు మరణిస్తాడో కచ్చితమైన సమయం చెప్పేది. అమెరికాలోని ఒక నర్సింగ్ హోమ్లో ఆస్కార్ అనే పిల్లి ఉండేది. ఈ పిల్లి రోగుల మరణాన్ని ముందే గుర్తించేది. డాక్టర్లు, సిబ్బంది దీన్ని చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు.
ఆస్కార్ ఒక థెరపీ క్యాట్. ఇది అమెరికాలోని ఒక నర్సింగ్ హోమ్లో గంభీరంగా అనారోగ్యంతో ఉన్న రోగుల సంరక్షణలో ఉండేది. సాధారణంగా ఆస్కార్ మనుషులతో పెద్దగా కలిసేది కాదు. కానీ రోగుల వద్దే ఉండేది. రోగి పరిస్థితి విషమించినప్పుడు మాత్రం దాని ప్రవర్తన మారిపోయేది.
ఆస్పత్రి సిబ్బంది ఒక విచిత్ర విషయాన్ని గమనించారు. పరిస్థివి సీరియస్గా ఉన్న రోగి గదిలోకి ఆస్కార్ పిల్లి నిశ్శబ్దంగా వెళ్లి రోగి పక్కన పడుకునేది. కొన్ని గంటల తర్వాత ఆ రోగి మరణించేవాడు. ఈ సంఘటన చాలా సార్లు పునరావృతమైంది. డాక్టర్లు దీన్ని తీవ్రంగా పరిగణించసాగారు.
ఆస్కార్ 100కి పైగా మరణాలను సరిగ్గా గుర్తించిందని నివేదికలు చెబుతున్నాయి. ఈ కచ్చితత్వం సీనియర్ డాక్టర్లను కూడా విస్మయం చేసింది. ఈ ప్రవర్తనకు సులభమైన వివరణ ఇవ్వడం ఎవరికీ సాధ్యం కాలేదు.
నిపుణులు ఇది అతీంద్రియ శక్తి కాదని చెబుతున్నారు. మరణిస్తున్న కణాలు కొన్ని రసాయనాలను విడుదల చేస్తాయని ఒక సిద్ధాంతం. పిల్లులు వాటిని సులభంగా వాసన చూడగలవు. రోగి శ్వాస, కదలికల్లో మార్పులను కూడా ఆస్కార్ గమనించి ఉండవచ్చు.
ఆస్కార్ ఉనికి.. రోగులు భయపడే వారు కాదు. చివరి క్షణాల్లో వారికి ఓదార్పును ఇచ్చేది. నిశ్శబ్దంగా పక్కన కూర్చుని ఉండేది. రోగి కుటుంబ సభ్యులు కూడా పిల్లితో సాన్నిహిత్యంగా ఉండేవారు. రోగులు ఒంటరిగా లేరని భావన కలిగించేది.
మొదట డాక్టర్లు గందరగోళం చెందారు. కానీ పదేపదే ఇదే జరగడంతో వారు దాని ప్రవర్తనను నమ్మేవారు. ఆస్కార్ రోగి పక్కన కూర్చుంటే డాక్టర్లు కూడా ఇక రోగి త్వరలోనే చనిపోతాడని నమ్మి ఆ రోగి కుటుంబసభ్యులను పిలిచి చివరి మాటలు చెప్పే అవకాశం ఇచ్చేవారు.
Also Read: పెళ్లి, పార్టీకి వెళ్లే ముందు ముఖంపై మొటిమలు వచ్చేసాయా? వెంటనే ఇలా చేయండి
కొందరు ఇది కేవలం యాదృచ్ఛికం అని అంటారు. మరికొందరు మనుషులు గమనించలేని మార్పులను జంతువులు గుర్తించగలవని చెబుతారు. అసలు కారణం ఇప్పటికీ తెలియదు. అయితే ఆస్కార పిల్లి 2022లో చనిపోయింది.
ఆస్కార్ గురించి మేకింగ్ రౌండ్స్ విత్ ఆస్కార్ అని పుస్తకం కూడా రాశారు. ఆస్కార్ కథ మీడియాలో, పుస్తకాల రూపంలో విస్తృతంగా చర్చనీయాంశమైంది. 2022లో ఆస్కార్ మరణించింది. ఇప్పటికీ దీని కథ ప్రజలను ఆకర్షిస్తూనే ఉంది.