E-Paper
Advertisement

Face Mask: చియా సీడ్స్‌తో ఫేస్ మాస్క్.. మొటిమలు మాయం

Face Mask: చియా సీడ్స్‌తో ఫేస్ మాస్క్.. మొటిమలు మాయం
Advertisement

Face Mask: శరీర ఆరోగ్యానికి చియా సీడ్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. శరీర ఆరోగ్యాన్ని కాదు..చియా విత్తనాలు చర్మ సంరక్షణకు కూడా మేలు చేస్తాయి. చియా గింజలతో తయారుచేసిన సహజమైన ఫేస్ మాస్క్‌లు ముఖాన్ని అందంగా మెరిసేలా చేస్తాయి. అంతే కాకుండా చర్మంపై ఉన్న మచ్చలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. మార్కెట్‌లో లభించే ఖరీదైన ఫేస్ మాస్క్‌లతో పోలిస్తే, చియా విత్తనాలతో తయారు చేసిన ఫేస్ మాస్క్ చాలా చౌకగా తయారు చేసుకోవచ్చు.

ముఖ్యంగా ఇది మొటిమలను తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది. చియా సీడ్స్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ముఖంపై ఉన్న మృత చర్మాన్ని తొలగించి, ముఖం కాంతిని పెంచడంలో సహాయపడతాయి. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న చియా సీడ్స్ ఫేస్ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

1.చియా సీడ్స్, తేనెతో ఫేస్ మాస్క్ ..
కావాల్సినవి:

చియా సీడ్స్- 2 టేబుల్ స్పూన్లు
నిమ్మ రసం- 1/2 టీ స్పూన్
తేనె- 1/2 టీ స్పూన్

Advertisement

తయారీ విధానం:  ఒక బౌల్ తీసుకుని అందులో పైన చెప్పిన మోతాదుల్లో చియా సీడ్స్, నిమ్మ రసం, తేనె వేసి కలుపుకోవాలి. ఇలా తయారు చేసిన ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న జిడ్డు తొలగిపోతుంది. అంతే కాకుండా ఇందులోని పోషకాలు ముఖంపై మొటిమలు రాకుండా చేస్తాయి.

2.చియా సీడ్స్, తేనె, ఆలివ్ ఆయిల్ ఫేస్ మాస్క్..
కావలసినవి:
చియా సీడ్స్- 2 టేబుల్ స్పూన్లు
తేనె- 1/2 టీ స్పూన్
ఆలివ్ ఆయిల్- 1/2 టీ స్పూన్

తయారీ విధానం: చియా గింజలతో ఫేస్ మాస్క్ చేయడానికి ఒక బౌల్ తీసుకుని అందులో పైన చెప్పిన మోతాదుల్లో చియా సీడ్స్, ఆలివ్ ఆయిల్ , తేనె వేసి కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఫేస్ మాస్క్ లాగా వేసుకుని 20 నిమిషాల పాటు ఉంచి కడిగేయాలి. ఇలా చేయడం ద్వారా చర్మం మెరుస్తుంది.

3. చియా గింజలు, కొబ్బరి నూనె ఫేస్ మాస్క్..
కావలసినవి:
చియా సీడ్స్- 2 టేబుల్ స్పూన్లు
కొబ్బరి నూనె- 1/2 టేబుల్ స్పూన్

తయారీ విధానం: చియా గింజలు, కొబ్బరి నూనెతో ఫేస్ ప్యాక్ తయారు చేయడం చాలా సులభం. దీని కోసం, గిన్నెలో 2 స్పూన్ల చియా గింజలను వేసి కొంత నీరు కలపండి. కొంత సమయం తరువాత, కొన్ని చుక్కల కొబ్బరి నూనె వేసి కలపాలి. ఇలా తయారు చేసిన ఈ ఫేస్ మాస్క్ ని ముఖానికి పట్టించి 10 నిమిషాల పాటు ఉంచి కడిగేయాలి. దీని ద్వారా చర్మం మృదువుగా మారుతుంది.

Also Read: వీటితో క్షణాల్లోనే మిలమిల మెరిసే చర్మం మీ సొంతం

4.చియా గింజలు, పాలతో ఫేస్ మాస్క్..
కావలసినవి:
చియా సీడ్స్ – 2 టేబుల్ స్పూన్లు
పాలు – సరిపడినంత

తయారీ విధానం: చియా విత్తనాలు, పాలతో ఫేస్ మాస్క్ తయారు చేసుకోవడానికి ముందుగా 2 చెంచాల చియా గింజల్లో తగినంత పాలు వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ ఫేస్ మాస్క్ ను ముఖానికి పట్టించి 15 నిమిషాలు ఉంచి, ఆపై నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం వల్ల ముఖం చల్లబడి చర్మం మృదువుగా, మెరిసిపోతుంది. అంతే కాకుండా తరుచుగా దీనిని వాడటం వల్ల మొటిమలు కూడా రాకుండా ఉంటాయి.

Related News

గణేశుడిని ఇంటికి తెచ్చేటప్పుడు..ఈ చిన్న విషయాలు మర్చిపోతే పూజ ఫలించదు ?

ఈ ఏడాది వినాయక చవితి ఎప్పుడు? సరైన తేదీ, పూజా సమయం!

పెన్, డైరీ లాంటివి వద్దు.. టీచర్స్ డే రోజు రూ.500 లోపు బడ్జెట్‌లో స్పెషల్ గిఫ్ట్స్

చిన్న చిన్న విషయాలకే కోపం వస్తోందా? ప్రశాంతంగా ఉండడానికి రోజూ ఈ 5 టిప్స్ పాటించండి

మామిడి ఆకులు కేవలం ఇంట్లో తోరణాలు కట్టడానికి కాదు.. స్కిన్ కేర్ నుంచి ఎరువు తయారీ వరకు ఎన్ని ప్రయోజనాలు

అదృష్టాన్ని కాదు కష్టాన్ని నమ్ముకుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారు ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయరు

ఈ వీకెండ్‌ అలవాట్లు ఉన్నవారిలో క్యాన్సర్ ముప్పు.. అతిగా ఎంజాయ్ చేస్తే యమ డేంజర్

హెవీ ఇయర్‌రింగ్స్‌తో చెవి నొప్పి వస్తుందా? చెవి రంధ్రాలు సాగకుండా ఈ సింపుల్ ట్రిక్ పాటించండి

Big Stories

Advertisement
×