E-Paper
Advertisement

Curry leaves: వంటింట్లో పోపు కష్టాలు.. చుక్కలు చూపిస్తున్న కరివేపాకు.. మార్కెట్‌లో ఇప్పుడు దీనిదే హవా!

Curry leaves: వంటింట్లో పోపు కష్టాలు.. చుక్కలు చూపిస్తున్న కరివేపాకు.. మార్కెట్‌లో ఇప్పుడు దీనిదే హవా!
Advertisement

Curry leaves: వంట గదిలో సువాసనలు వెదజల్లే కరివేపాకు ధర ప్రస్తుతం సామాన్యులకు ‘చుక్కలు’ చూపిస్తోంది. వారం రోజుల క్రితం వరకు కిలో రూ. 30 నుండి రూ. 40 మధ్య పలికిన ధర, ఒక్కసారిగా రూ. 100 మార్కును దాటేసింది. కేవలం ధర పెరగడమే కాకుండా, మార్కెట్‌లో నాణ్యమైన కరివేపాకు లభించడం కూడా గగనమైపోతోంది. దీంతో వంటింట్లో పోపు వేయాలంటేనే గృహిణులు వెనకాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణం తీవ్రమైన మంచు, చలి వాతావరణం. చలికాలంలో కరివేపాకు దిగుబడి సహజంగానే తగ్గుతుంది. దీనికి తోడు ఉదయం పూట కురుస్తున్న పొగమంచు వల్ల ఆకులు నల్లబడటం, రంగు మారి పాడైపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో చెట్ల నుండి కోసిన ఆకుల్లో సగానికి పైగా నాణ్యత లేకపోవడంతో రైతులు మార్కెట్‌కు తీసుకురాలేకపోతున్నారు. ఫలితంగా మార్కెట్‌లో సరఫరా గణనీయంగా పడిపోయి ధరలకు రెక్కలు వచ్చాయి.

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, అనంతపురం జిల్లాల నుండి తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన మార్కెట్లకు కరివేపాకు సరఫరా అవుతుంది. అయితే, స్థానికంగా దిగుబడి తగ్గడంతో హోల్‌సేల్ మార్కెట్‌లో టన్ను కరివేపాకు ధర సుమారు రూ. 55 వేల వరకు పలుకుతోంది. దీనికి రవాణా ఖర్చులు, హమాలీ చార్జీలు తోడవ్వడంతో రిటైల్ మార్కెట్‌కు వచ్చేసరికి వినియోగదారుడిపై భారం రెట్టింపు అవుతోంది. గతేడాదితో పోలిస్తే ఈసారి చలి ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని వ్యాపారులు చెబుతున్నారు.

కేవలం కరివేపాకు మాత్రమే కాకుండా, ఇతర ఆకుకూరల ధరలు కూడా మంచు ప్రభావంతో మండిపోతున్నాయి. గతంలో కొత్తిమీర, కరివేపాకులను కూరగాయలు కొంటే ఉచితంగా ఇచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు పది రూపాయలకు కూడా కనీసం ఒక చిన్న కట్ట కరివేపాకు రావడం లేదు. హోటళ్లు, క్యాటరింగ్ రంగం వారు కూడా ఈ పెరిగిన ధరల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వంటల్లో కరివేపాకు వినియోగాన్ని తగ్గించాల్సిన దుస్థితి నెలకొంది.

Advertisement

Also Read: క్రేవింగ్స్‌ను అదుపు చేయలేకపోతున్నారా? చిప్స్, చాక్లెట్లకు బదులు ఇవి తీసుకోండి

ఈ ధరల పెరుగుదల తాత్కాలికమేనని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎండలు పెరిగి మంచు ప్రభావం తగ్గితే, కొత్త చిగురు వచ్చి దిగుబడి పెరిగే అవకాశం ఉంది. అప్పటి వరకు సామాన్యులకు ఈ ఘాటు తప్పేలా లేదు. మార్చి నెల నాటికి సరఫరా సాధారణ స్థితికి చేరుకుంటే ధరలు మళ్ళీ రూ. 40-50 శ్రేణిలోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Related News

ఒక్క పన్ను పీకడానికి రూ.2.25 లక్షలా.. అదే ఇండియాలో అయితే?

డెస్క్ జాబ్ చేస్తున్నారా? ఎక్కువసేపు కూర్చోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

తగ్గేదెలే.. ఈ తేదీల్లో పుట్టినవారు ఆత్మగౌరవం విషయంలో అసలు రాజీపడరు

స్కూల్‌కు వెళ్లే సమయం అయినా పిల్లలు నిద్రలేవడం లేదా? ఈ 5 టిప్స్‌తో మార్నింగ్ రొటీన్ మార్చండి

గుండెపోటు ముప్పును 30 శాతం తగ్గించగల పిల్.. తాజా అధ్యయనంలో అద్భుత ఫలితాలు

వర్షాకాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారా? రోగ నిరోధక శక్తి పెంచుకోవడానికి ఈ పుడ్స్

రక్తంలో చక్కెర పెరగకుండా ఉండాలంటే ఆపిల్ తినాలా? పియర్ తినాలా?

ఉదయం ఫ్రెష్‌గా లేవాలంటే రాత్రి ఎప్పుడు పడుకోవాలి? నిపుణులు ఏం చెబుతున్నారు?

Big Stories

Advertisement
×