చాలా మంది ఉదయం లేచి వెంటనే వేడి వేడి టీతో రోజు ప్రారంభిస్తారు. టీ తాగడం వల్ల ఫ్రెష్గా, చురుకుగా అనిపిస్తుంది. కానీ ఖాళీ కడుపున టీ తాగడం ఆరోగ్యానికి హానికరం. వైద్య నిపుణులు ఈ అలవాటు జీర్ణక్రియ, కిడ్నీలపై చెడు ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. దీని వల్ల యాసిడిటీ, ప్రేగుల్లో ఇతర సమస్యలు వస్తాయి.
టీలో కెఫీన్, టానిన్స్ ఉండటం వల్ల కడుపులో ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. రాత్రంతా ఖాళీగా ఉన్న కడుపు సున్నితంగా ఉంటుంది. స్ట్రాంగ్ టీ.. కడుపు లైనింగ్ను చికాకుపెట్టి యాసిడిటీ, గ్యాస్, ఉబ్బరం, గుండెలో మంట వంటి సమస్యలను కలిగిస్తుంది. కొందరికి వాంతులు కూడా వస్తాయి.
ఆహారం లేకుండా టీ తాగడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. కెఫీన్ శరీరం నుంచి నీటిని ఎక్కువగా వెళ్లగొట్టి డీహైడ్రేషన్ కలిగిస్తుంది. ఇది కిడ్నీల పనితీరును దెబ్బతీస్తుంది. ఎక్కువ టీ తాగడం వల్ల శరీరంలో మలినాలు పేరుకుపోయే అవకాశం ఉంది. కిడ్నీలు సరిగా పని చేయాలంటే తగినంత నీళ్లు తాగడం చాలా ముఖ్యం.
ఉదయం ఖాళీ కడుపున టీ తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ హఠాత్తుగా ఉత్తేజితమవుతుంది. దీంతో సహజ జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. కాలక్రమేణా ఆహారం సరిగా జీర్ణం కాదు. నిరంతర యాసిడిటీ కడుపు లైనింగ్ను దెబ్బతీస్తుంది.
టీలో ఉండే టానిన్స్, ఐరన్, కాల్షియం శోషణను తగ్గిస్తాయి. ఖాళీ కడుపున టీ తాగడం వల్ల శరీరం బలహీనంగా, అలసటగా ఉంటుంది. రక్తహీనత వచ్చే ప్రమాదం కూడా ఎక్కువ. మరీ ముఖ్యంగా పిల్లలు, మహిళలు ఖాళీ కడుపున టీ తాగే అలవాటు మానుకోవాలి.
చాలా మంది టీ తాగితేనే ప్రేగులు కదులుతాయని, తాజాగా ఉంటారని అనుకుంటారు. కానీ ఇది అనారోగ్యకరమైన అలవాటు. శరీరానికి సహజంగా ఉదయం వ్యర్థాలను తొలగించే సామర్థ్యం ఉంటుంది. వ్యాయామం, నీళ్లు తాగడం ద్వారా సహజంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
Also Read: మీరు ప్రేమించే వ్యక్తులు మిమ్మల్ని ఒంటరిగా చేసి వెళ్లిపోతారు.. దీనికి కారణాలు ఇవే
డాక్టర్లు ఉదయం మొదట నీళ్లు తాగాలని సూచిస్తారు. నీళ్లు శరీరాన్ని హైడ్రేట్ చేసి జీర్ణక్రియను పెంచుతాయి. టీ తాగడానికి ముందు పండ్లు, బిస్కెట్లు లేదా తేలికపాటి బ్రేక్ఫాస్ట్ తినాలి. హెర్బల్ టీ లేదా గ్రీన్ టీ మంచి ఎంపికలు.