E-Paper
Advertisement

Malaria Vaccine : వ్యాక్సిన్లతో మలేరియాకు తెర?

Malaria Vaccine : వ్యాక్సిన్లతో మలేరియాకు తెర?
Advertisement

Malaria Vaccine : చాప కింద నీరులా కబళించే వ్యాధి మలేరియా. 2021లో 24.7 కోట్ల కేసులు వెలుగుచూశాయి. ఆ ఏడాది మరణాలు ఆరులక్షలకుపైనే. మానవులను పీల్చి పిప్పి చేసే ఈ దోమకాటు వ్యాధికి రెండో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఆర్21/మ్యాట్రిక్స్-ఎం మలేరియా వ్యాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ.. WHO ఆమోద ముద్ర కూడా లభించింది.

Advertisement

ఆఫ్రికాలోని ఐదేళ్ల లోపు వయసున్న పిల్లలకు ఈ వ్యాక్సిన్ వేయొచ్చని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. యూనివర్సిటీ ఆక్స్‌ఫర్డ్, సెరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా దీనిని అభివృద్ధి చేశాయి. తొలి వ్యాక్సిన్‌తో పోలిస్తే ఇది అతి చౌక. లభ్యతా ఎక్కువే. మరి ఇకనైనా మలేరియా కట్టడి సాధ్యమవుతుందా? అంటే కాకపోవచ్చనే అంటున్నారు నిపుణులు.

మలేరియా తొలి వ్యాక్సిన్ మస్కిరిక్స్‌ను డబ్లూహెచ్‌వో 2021లో ఆమోదించింది. జీఎస్‌కే ఫార్మా కంపెనీ అభివృద్ధి చేసిన ఆ వ్యాక్సిన్ ఎఫికసీ 30 శాతమే. పైగా నాలుగు డోసులు ఇవ్వాలి. అయినా మలేరియా నుంచి లభించే రక్షణ నెలల వ్యవధిలోనే మటుమాయం కావడం ఆరోగ్య నిపుణులను ఆందోళనకు గురి చేసింది. ఇప్పటి వరకు ఘనా, కెన్యా, మలావి‌లోని 17 లక్షల మంది చిన్నారులకు మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వగలిగారు. డిమాండ్‌కు తగ్గట్టుగా లభ్యత లేకపోవడమే ఇందుకు కారణం. ఏడాదికి 15 మిలియన్ డోసులను మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతున్నారు.

Advertisement

ఇక తాజాగా ఆమోదం పొందిన ఆర్21 వ్యాక్సిన్‌ డోసులను పుణెలోని సెరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేయనుంది. ఏడాదికి 200 మిలియన్ల వరకు ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేయగలమని ఆ సంస్థ చెబుతోంది. వ్యాక్సిన్ సామర్థ్యం కూడా 75% అని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ వ్యాక్సినాలజిస్ట్ అడ్రెయిన్ హిల్ వెల్లడించారు. రెండు వ్యాక్సిన్ల మధ్య ప్రధాన వ్యత్యాసం లభ్యత. మస్కిరిక్స్‌తో పోలిస్తే ఆర్21 టీకా లభ్యత ఎక్కువగా ఉంటుంది.

అయితే ఈ రెండు వ్యాక్సిన్లు మలేరియా వ్యాప్తిని సంపూర్ణంగా అరికట్టలేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇమ్యూనైజేషన్ ప్రక్రియతో సరిపెట్టుకోకుండా.. ఇతర చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మందులను సైతం తట్టుకుని నిలబడేలా మలేరియా పారసైట్‌, దోమలకు అవకాశం ఇవ్వకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

ఆర్21 వ్యాక్సిన్ ఇప్పట్లో భారత్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. హైరిస్క్ ఉన్న ఆఫ్రికా దేశాలకు మాత్రమే డోసుల పంపిణీ జరుగుతుంది. భారత్‌లో పలు ప్రాంతాల్లో మలేరియా బెడద ఎక్కువగానే ఉంది. జనాభాలో 95% మంది మలేరియా ఎండమిక్ ఏరియాల్లోనే నివసిస్తున్నారు. 20 శాతం జనాభా నివసించే గిరిజన, కొండ, మారుమూల ప్రాంతాల్లోనే 80 శాతం మలేరియా కేసులు నమోదమవుతున్నాయి. అయితే 2018-22 మధ్య మలేరియా కేసుల సంఖ్యను ప్రభుత్వం గణనీయంగా తగ్గించగలిగింది.

Related News

పాత, చిరిగిన చీరలను పారేస్తున్నారా? వాటిని ఇలా ఉపయోగిస్తే ఎన్ని ప్రయోజనాలో

జీన్స్ ధరించగానే నడుము వద్ద లవ్ హ్యాండిల్స్ కనిపిస్తున్నాయా? సన్నని నడుము కోసం ఈ వ్యాయామం చేయండి

మన రక్తనాళాల్లో ప్లాస్టిక్.. గుండె పోటు వచ్చినవారిలో మరీ ఎక్కువ.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు

బాత్‌రూమ్, వాష్‌రూమ్, రెస్ట్‌రూమ్.. ఈ మూడు ఒకటి కాదా? ఏ పదం ఎప్పుడు వాడాలి?

డెంగీ భయానికి ఎండ్ కార్డ్ పడింది.. భారత్‌లోకి వచ్చేసిన ఫస్ట్ వ్యాక్సిన్!

పిల్లలు ఫోన్ వదిలేయాలంటే తిట్టడం కాదు.. ఈ టీచర్ చేసిన మ్యాజిక్ చూడండి!

ఆ దేశం ప్రజలు కేవలం రాత్రి మాత్రమే స్నానం చేస్తారు? ఈ అలవాటు వెనుక ప్రత్యేక కారణం ఇదే

తినడానికే బతుకుతుంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారికి ఎప్పుడూ తిండిపైనే ధ్యాస

Big Stories

Advertisement
×