Rice Water: బియ్యం కడిగిన నీళ్లు అనగానే మనకు మన బామ్మల కాలం నాటి చిట్కాలు గుర్తొస్తాయి. ఆసియా దేశాల్లో శతాబ్దాలుగా వాడుకలో ఉన్న ఈ పద్ధతి. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని మళ్లీ ట్రెండింగ్లోకి వచ్చింది. చర్మం మెరిసిపోవడానికి.. అంతే కాకుండా ఓపెన్ ఫోర్స్ తగ్గడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుందని చాలామంది నమ్ముతారు. అయితే.. ఈ నీళ్లను రాత్రి పూట ముఖానికి అప్లై చేసి అలాగే వదిలేస్తే ఏం జరుగుతుంది ? అది చర్మానికి మంచిదా లేక ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? అనే విషయాలను గురించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బియ్యం నీళ్లలో ఉండే స్టార్చ్, అమినో యాసిడ్స్, విటమిన్లు , యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి పోషణను అందిస్తాయి. రసాయనాలతో కూడిన ఖరీదైన టోనర్ల కంటే.. ఇంట్లోనే లభించే ఈ సహజసిద్ధమైన లిక్విడ్ చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుందని బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్లు చెబుతుంటారు.
రైస్ వాటర్ రాత్రి పూట ముఖానికి ఎలా వాడాలి ?
మొదట ముఖాన్ని మైల్డ్ క్లెన్సర్తో శుభ్రం చేసకోవాలి. తర్వాత కాటన్ ప్యాడ్ సాయంతో బియ్యం నీళ్లను టోనర్లా ముఖం అంతా అప్లై చేయాలి. అది ఆరిపోయే వరకు ఆగి.. పైన ఎలాంటి క్రీములు రాయకుండానే నిద్రపోవాలి.
మరుసటి రోజు ఉదయం కనిపించే మార్పులు:
ఉదయాన్నే నిద్రలేవగానే చర్మంలో కొన్ని స్పష్టమైన మార్పులు వస్తాయి.
చర్మం బిగుతు: చర్మం చాలా స్మూత్గా , టైట్గా అనిపించింది. ముక్కు చుట్టూ ఉన్న రంధ్రాలు కూడా చిన్నవిగా మారతాయి.
గ్లో: ముఖం మునుపటి కంటే కాస్త కాంతివంతంగా, తాజాగా కనిస్తుంది.
పొడిబారడం: అయితే.. చర్మం కొంచెం పొడిబారినట్లు అనిపిస్తుంది. బియ్యం నీళ్లలోని స్టార్చ్ వల్ల ముఖం మీద ఒక సన్నని పొరలా ఏర్పడటమే దీనికి కారణం.
సైడ్ ఎఫెక్ట్స్:
ఈ పద్ధతి బాగానే అనిపించినా.. అందరికీ ఇది సెట్ కాకపోవచ్చు. ముఖ్యంగా..
డ్రై స్కిన్ ఉన్నవారికి: బియ్యం నీళ్లు చర్మాన్ని మరింత పొడిబారేలా చేస్తాయి. కాబట్టి డ్రై స్కిన్ వారు దీనిని రాత్రంతా ఉంచుకోకపోవడమే మంచిది.
మొటిమలు: సెన్సిటివ్ స్కిన్ లేదా మొటిమల సమస్య ఉన్నవారికి ఇది సరిపడకపోవచ్చు. రాత్రంతా ఉంచడం వల్ల చికాకు కలిగే అవకాశం ఉంది.
నిల్వ ఉన్న నీళ్లు: వాడే బియ్యం నీళ్లు తాజాగా ఉండాలి. పులిసిన లేదా పాత నీళ్లను వాడితే ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.
Also Read: షుగర్ మానేసిన 14 రోజుల్లోనే బరువు తగ్గడం సాధ్యమా ? నిపుణులు ఏం చెబుతున్నారు ?
జాగ్రత్తలు, సూచనలు:
బియ్యం నీళ్లను ముఖానికి రాసుకోవడం మంచిదే కానీ.. అతిగా వాడటం అంత మంచిది కాదు. గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు లేదా స్కిన్ నిపుణులు సూచించినట్లు ఏదీ పరిమితికి మించి చేయకూడదు.
1. వారానికి 2 నుంచి 3 సార్లు మాత్రమే ఇలా చేయండి.
2. బియ్యం నీళ్లను ఫ్రిజ్లో ఉంచి.. తాజాగా ఉన్నప్పుడే వాడండి.
3. మరుసటి రోజు ఉదయం ముఖం కడుక్కున్న తర్వాత తప్పనిసరిగా మాయిశ్చరైజర్ రాసుకోండి.
4. మొదటిసారి ట్రై చేసేవారు ప్యాచ్ టెస్ట్ (ముందుగా చెవి వెనుక రాసి చూడటం) చేసుకోవడం మర్చిపోవద్దు.
బియ్యం నీళ్లు ఖచ్చితంగా మీ చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి. కానీ ఇది రాత్రికి రాత్రే అద్భుతాలు చేసే మంత్రం కాదు. సహజ సిద్ధమైన చిట్కాలను వివేకంతో వాడితేనే మెరుగైన ఫలితాలు ఉంటాయి.