E-Paper
Advertisement

Nampalli Fire Accident: నాంపల్లి అగ్నిప్రమాదం.. మృతదేహాల గుర్తింపు, ఘటన వెనుక అసలు కారణం ఇదే

Nampalli Fire Accident: నాంపల్లి అగ్నిప్రమాదం..  మృతదేహాల గుర్తింపు,  ఘటన వెనుక అసలు కారణం ఇదే
Advertisement

Nampalli Fire Accident: నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ షాపులో జరిగిన అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. భవనం సెల్లారులో చిక్కుకున్న వారంతా మరణించారు. ఐదుగురి మృతదేహాలను గుర్తించి బయటకు తీశారు. వారిలో బీబీ, ఇంతియాజ్, హబీబ్ లతోపాటు చిన్నారులు ప్రతీణ్, అఖిల్ ఉన్నారు. వారి మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అగ్నిప్రమాదంలో మరణించడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

నాంపల్లిలో ఫర్మిచర్ షాపు అగ్నిప్రమాదం వెనుక

Advertisement

శనివారం సాయంత్రం నాంపల్లి స్టేషన్‌ రోడ్డులోని హిందీ ప్రచార్‌సభ భవనం పక్కన ఐదంతస్తుల భవనంలో ఫర్నిచర్‌ షాపు ఉంది. శుక్రవారం రాత్రి ఆ షాపుకు చైనా నుంచి భారీగా ఫర్నిచర్‌ వచ్చింది. వాటిని రెండు సెల్లార్లలో భద్రపరిచారు షాపు యజమానులు. ఆ షాపులో దాదాపు 22 మంది పని చేస్తున్నారు.

వాచ్‌మెన్‌ యాదయ్య-లక్ష్మి దంపతులు తమ ఇద్దరు పిల్లలు ప్రణీత్‌,అఖిల్‌ లతో కలసి సెల్లార్‌లో నివాసం ఉంటోంది. పిల్లలిద్దరు శనివారం స్కూల్‌కి వెళ్లకుండా ఇంట్లో ఉన్నారు. సెల్లార్‌లో ఆడుకోవాలని పిల్లలకు చెప్పి పని మీద తల్లిదండ్రులు బయటకు వెళ్లారు. శనివారం మధ్యాహ్నం సమయంలో భవనంలోని రెండు సెల్లార్లలో అగ్నిప్రమాదం జరిగింది.

Advertisement

ఐదుగురి మృతదేహాలు వెలికితీత.. తీవ్రత వెనుక కెమికల్స్

భారీగా పొగలు రావడంతో సిబ్బంది బయటకు పరుగులు తీశారు. అక్కడ పని చేస్తున్న ఇంతియాజ్‌, సయ్యద్‌ హబీబ్‌‌లు సెల్లార్లో చిక్కుకున్న ప్రణీత్, అఖిల్, బీబీలను బయటకు తీసుకువచ్చేందుకు లోపలికి వెళ్లారు. ఆ తర్వాత వారు తిరిగి రాలేదు. ఘటన గురించి తెలియగానే ఓ వైపు హైడ్రా.. మరోవైపు పోలీసులు ఇంకోవైపు ఫైర్ సిబ్బంది మొహరించి సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

దట్టమైన పొగలు వ్యాపించడంతో సహాయక కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆదివారం ఉదయం సహాయక చర్యలు కొనసాగాయంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.  దాదాపు 20 గంటలపాటు సహాయక బృందాలు శ్రమించాయి.

ఈ ఘటన గురించి బిగ్ టీవీ‌తో మాట్లాడారు ఫైర్ డీజీ విక్రమ్‌సింగ్ మాన్. నాంపల్లి అగ్నిప్రమాదం ఘటనలో ఐదుగురు మృతి చెందారని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లో ఫర్నిచర్ పెట్టడం ప్రమాద తీవ్రతను పెంచిందన్నారు. బచ్చాసి యజమాని సతీష్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. చిక్కుకున్న ఐదుగురు ఆచూకీ కోసం రాత్రంతా 200 మంది ఫైర్ కష్టపడి పని చేశారని తెలిపారు.

ALSO READ: బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం.. ఆ ఛానల్ బహిష్కరణ

మొదటి మృతదేహం 9. 15 గంటలకు దొరికిందన్నారు. అయితే రాత్రంతా మంటలు, పొగలను అదుపులోకి తెచ్చేందుకే చాలా సమయం పట్టిందన్నారు. సెల్లార్‌లో గోడౌన్ ను ఏర్పాటు చేయడం, ఫర్నిచర్‌తోపాటు కెమికల్స్‌ను అందులో పెట్టారని వివరించారు. బేస్‌మెంట్‌ను పూర్తిగా దుర్వినియోగం చేశారని, ప్రమాదం వెనుక షార్ట్ సర్క్యూట్ లేదా సిగరెట్ ద్వారా కూడా ప్రమాదం జరిగి ఉండవచ్చని అన్నారు.

ప్రమాదకరమైన కెమికల్స్ తీవ్రత ఎక్కువగా ఉండడంతో సిబ్బంది లోపలికి వెళ్ళడం సాధ్యం కాలేదన్నారు. సెల్లార్ చివర్లో రెండు రూములు ఏర్పాటు చేశారని, మంటలు స్టార్ట్ అయిన తర్వాత రూమ్ నుండి ర్యాంప్ వైపు వెళ్లినట్టు తెలిపారు. ర్యాంప్ మొత్తం సామానులతో ప్యాక్ చేసి ఉందన్నారు.  మెట్ల మార్గం నుండి పైకి వచ్చేందుకు ప్రయత్నించారని, అక్కడ ఐరన్ షట్టర్ కు తాళం వేసి ఉండడంత బయటికి రాలేకపోయారని వివరించారు.

బిల్డింగ్ కండిషన్ మంచిగా దృఢంగానే ఉందని, ఫైర్ డిపార్ట్మెంట్ నుండి ఎలాంటి అనుమతులు తీసుకోలేదన్నారు. బిల్డింగ్ పర్మిషన్ల సమయంలో అంతా బాగానే ఉందని, కొద్ది రోజుల తర్వాత అక్రమంగా సెల్లార్లను దుర్వినియోగం చేశారన్నారు. జీహెచ్ఎంసి లో చాలా వరకు ఈ తరహా ఉల్లంఘనలకి పాల్పడుతున్నారని, ఫైర్ డిపార్ట్మెంట్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుందన్నారు.

 

Related News

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

Big Stories

Advertisement
×