E-Paper
Advertisement

యోగిని ఏకాదశి.. జూలైలో ఏ తేదీన ఉపవాసం ఉండాలి? శుభ ముహూర్తం, పారణ సమయం వివరాలు

యోగిని ఏకాదశి.. జూలైలో ఏ తేదీన ఉపవాసం ఉండాలి? శుభ ముహూర్తం, పారణ సమయం వివరాలు
Advertisement

హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన ఏకాదశులలో యోగిని ఏకాదశి ఒకటిగా భావిస్తారు. ఈ రోజున భక్తులు శ్రీ మహావిష్ణువును భక్తిశ్రద్ధలతో పూజించి ఉపవాసం ఉంటారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల జీవితంలో శాంతి, సుఖసంతోషాలు, ఐశ్వర్యం, ఆ లక్ష్మీపతి అనుగ్రహం లభిస్తాయని విశ్వాసం. అయితే 2026లో యోగిని ఏకాదశి జూలై 10నా లేదా జూలై 11నా అనే సందేహం చాలా మందిలో ఉంది. పంచాంగం ప్రకారం సరైన తేదీ, ముహూర్తాలు, పారణ సమయం గురించి తెలుసుకుందాం.

యోగిని ఏకాదశి ఉపవాసం ఏ రోజున చేయాలి?

ఆషాఢ మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశినే యోగిని ఏకాదశిగా జరుపుకుంటారు. పంచాంగం ప్రకారం 2026 జూలై 10 ఉదయం 8:16 గంటలకు ఏకాదశి తిథి ప్రారంభమై, జూలై 11 ఉదయం 5:22 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి నియమం ప్రకారం.. జూలై 10, శుక్రవారం రోజున యోగిని ఏకాదశి ఉపవాసం ఆచరించాలి. అయితే వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించే భక్తులు జూలై 11, శనివారం రోజున ఉపవాసం ఉంటారు. అందువల్ల సంప్రదాయాన్ని బట్టి ఉపవాస తేదీ మారుతుంది.

యోగిని ఏకాదశి రోజున శుభ ముహూర్త సమయం

Advertisement

యోగిని ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకు పూజలు, జపాలు, ధ్యానం చేయడానికి కొన్ని శుభ సమయాలు ఉన్నాయి.
బ్రహ్మ ముహూర్తం.. ఉదయం 4:41 నుంచి 5:24 వరకు
ప్రాతః సంధ్య.. ఉదయం 5:03 నుంచి 6:07 వరకు
అభిజిత్ ముహూర్తం.. మధ్యాహ్నం 12:17 నుంచి 1:10 వరకు
విజయ ముహూర్తం.. మధ్యాహ్నం 2:56 నుంచి 3:49 వరకు
గోధూళి ముహూర్తం.. సాయంత్రం 7:19 నుంచి 7:41 వరకు
ఈ సమయాల్లో పూజలు చేయడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు.

యోగిని ఏకాదశి పారణ సమయం ఎప్పుడు?

యోగిని ఏకాదశి ఉపవాసాన్ని జూలై 11న విరమించాలి. పంచాంగం ప్రకారం మధ్యాహ్నం 2:03 గంటల నుంచి 4:42 గంటల వరకు పారణ చేయడం శుభంగా భావిస్తారు. అదే రోజు హరి వాసరం ఉదయం 10:31 గంటలకు ముగుస్తుంది. హరి వాసరం పూర్తయ్యే వరకు ఉపవాసాన్ని విరమించకూడదని ధార్మిక సంప్రదాయాలు చెబుతున్నాయి. సరైన సమయంలో పారణ చేయడం వ్రతానికి పూర్తి ఫలితాన్ని ఇస్తుందని విశ్వాసం.

Advertisement

Also Read: దాంపత్య జీవితంలో అపార్థాలు పెరిగిపోతున్నాయా? ఈజీ టిప్స్‌తో రిలేషన్ మెరుగుపరుచుకోండి

యోగిని ఏకాదశి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత

యోగిని ఏకాదశి శ్రీ మహావిష్ణువు భక్తులకు ఎంతో విశిష్టమైన రోజు. ఈ రోజున భక్తితో ఉపవాసం చేసి పూజలు చేస్తే జీవితంలోని అడ్డంకులు తొలగి సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం. అలాగే ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆధ్యాత్మిక పురోగతి కూడా లభిస్తాయని విశ్వసిస్తారు.

హిందూ ధార్మిక గ్రంథాల ప్రకారం యోగిని ఏకాదశి వ్రతాన్ని భక్తితో ఆచరిస్తే 88 వేల మంది బ్రాహ్మణులకు అన్నదానం చేసినంత పుణ్యం లభిస్తుందని పేర్కొనబడింది. అందుకే ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ పవిత్ర వ్రతాన్ని విశ్వాసంతో పాటిస్తారు.

గమనిక : పై సమాచారం హిందూ ధార్మిక విశ్వాసాలు, పంచాంగం, పురాణాలు, సంప్రదాయాల ఆధారంగా ఇవ్వబడింది. వీటికి శాస్త్రీయ ఆధారాలు ఉండకపోవచ్చు. భక్తులు తమ విశ్వాసం, ఆచారాల ప్రకారం ఈ వ్రతాన్ని పాటించవచ్చు.

Related News

దేశంలో వర్షాకాలం ఫుడ్ ఫెస్టివల్స్.. జూలై, ఆగస్టు 2026 నెలల్లో స్పెషల్

దోసకాయ చేదుగా ఉందని పారేస్తున్నారా? ఈ చిట్కాలు పాటిస్తే రుచి మారిపోతుంది

నరనరాల్లో ఉద్రేకం.. ఈ తేదీల్లో పుట్టినవారికి విపరీతమైన కోపం..

దాంపత్య జీవితంలో అపార్థాలు పెరిగిపోతున్నాయా? ఈజీ టిప్స్‌తో రిలేషన్ మెరుగుపరుచుకోండి

ఆహారం తినే గోల్డెన్ రూల్.. ఈ విధంగా తింటే 90 శాతం రోగాలు దూరం

జులై 2026లో కాలాష్టమి ఎప్పుడు? కాల భైరవుని పూజా ప్రాముఖ్యత, ముహూర్తం తెలుసుకోండి

గర్భవతి మహిళలు పారాసిటమాల్ తీసుకుంటే పిల్లలకు ఆటిజం, బుద్ధిమాంద్యం.. నిజమేనా?

Big Stories

Advertisement
×