E-Paper
Advertisement

ఆస్కార్ కొత్త రూల్స్.. నటులకు గుడ్ న్యూస్!

ఆస్కార్ కొత్త రూల్స్.. నటులకు గుడ్ న్యూస్!
Advertisement

Oscar New Rules:సినిమా ప్రపంచంలో అత్యున్నత పురస్కారమైన ఆస్కార్‌ లో సరికొత్త మార్పులు మొదలయ్యాయి. 2027లో జరగబోయే 99వ ఆస్కార్ వేడుకల కోసం అకాడమీ కీలక నిబంధనలను ప్రకటించింది. నటీనటులకు భారీ ఊరటనిస్తూనే, పెరుగుతున్న టెక్నాలజీ (AI) వల్ల వచ్చే ముప్పును అడ్డుకునేలా ఈ రూల్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఒకే నటుడు ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు పొందే అవకాశం కల్పించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది.

నటులకు అదిరిపోయే ఛాన్స్:

ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం, ఒక నటుడు ఒకే విభాగంలో (ఉదాహరణకు బెస్ట్ యాక్టర్) కేవలం ఒక సినిమాకు మాత్రమే నామినేట్ అయ్యే అవకాశం ఉండేది. కానీ ఇకపై ఆ రూల్ మారబోతోంది. ఒకే నటుడు ఒకే ఏడాదిలో రెండు వేరువేరు సినిమాల్లో అద్భుతంగా నటించి ఉంటే, ఆ రెండు సినిమాలకూ నామినేషన్లు దక్కించుకోవచ్చు. దీనివల్ల ప్రతిభ ఉన్న నటులకు అన్యాయం జరగకుండా అకాడమీ ఈ నిర్ణయం తీసుకుంది.

ఏఐ (AI)కి అకాడమీ చెక్:

Advertisement

ఈ మధ్య కాలంలో సినిమాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకం బాగా పెరిగిపోయింది. అయితే ఆస్కార్ అకాడమీ దీనిపై కఠినంగా వ్యవహరించనుంది. స్క్రీన్ ప్లే విభాగంలో రచయితలు స్వయంగా రాసిన కథలకే ప్రాధాన్యత ఇస్తామని, ఏఐ సాయంతో రాసిన వాటిని పరిగణనలోకి తీసుకోమని స్పష్టం చేసింది. మానవ మేధస్సుతో పుట్టిన కళకు మాత్రమే గౌరవం దక్కాలని ఈ నిర్ణయం తీసుకున్నారు.

యాక్టింగ్‌లో రియాలిటీకే ఓటు:

కేవలం రైటింగ్ మాత్రమే కాదు, నటనలో కూడా ఏఐ మ్యాజిక్ చెల్లదు. కృత్రిమ మేధతో సృష్టించిన సీన్లు లేదా డిజిటల్‌గా మార్పులు చేసిన ప్రదర్శనలను అకాడమీ అంగీకరించదు. నటులు నేరుగా కెమెరా ముందు ఇచ్చే సహజమైన ప్రదర్శనలకే అవార్డులు ఇస్తామని తేల్చి చెప్పింది. అంటే నటనలో ‘ఒరిజినాలిటీ’ ఉన్న వారికే ఇకపై ఆస్కార్ దక్కనుంది.

Advertisement

also read:Film industry: కళ్లెదుటే బికినీ మార్చుకోమన్నాడు.. స్టార్ డైరెక్టర్ పై యంగ్ బ్యూటీ ఫైర్!

అంతర్జాతీయ సినిమాల్లో మార్పులు:

ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో కూడా కొన్ని కీలక మార్పులు చేశారు. ఒక దేశం నుంచి ఇప్పుడు ఒకటి కంటే ఎక్కువ సినిమాలు నామినేషన్ రేసులో ఉండొచ్చు. అంతేకాదు, కేన్స్ వంటి ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ లో అవార్డులు గెలిచిన సినిమాలు నేరుగా ఆస్కార్ బరిలో నిలిచేలా నిబంధనలను సవరించారు. ఇకపై ఆస్కార్ ట్రోఫీపై దేశం పేరుతో పాటు దర్శకుడి పేరు కూడా ముద్రిస్తారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా ఆస్కార్ అకాడమీ తీసుకున్న ఈ నిర్ణయాలు సినిమా రంగంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ముఖ్యంగా నటులకు ఎన్ని అవకాశాలైనా దక్కేలా ఉండటం, ఏఐ ప్రభావం లేకుండా స్వచ్ఛమైన కళను ప్రోత్సహించడం ప్రశంసనీయం. 2027 మార్చి 14న లాస్ ఏంజిల్స్ లో జరగబోయే ఈ వేడుకలపై ఇప్పటి నుండే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ కొత్త రూల్స్ తో ఎంతమందికి లక్ కలిసి వస్తుందో చూడాలి!

Related News

ఐశ్వర్య రాజేష్ మొరను ఆలకించిన డైరెక్టర్.. బాలయ్య మూవీలో క్రేజీ రోల్!

‘విక్రమ్ 1’ ర్యాకెట్ ప్రయోగంలో జబర్దస్త్ సత్యశ్రీ చెల్లి కీలక పాత్ర.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ నటి ఎమోషనల్!

నటిగా పీవీ సింధు.. ఆసక్తిని రేకెత్తిస్తున్న పోస్ట్!

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

Big Stories

Advertisement
×