E-Paper
Advertisement

Venkatesh: మన శంకర్ వరప్రసాద్ ఎఫెక్ట్.. వెంకీ పేరును మార్చేసిన అభిమానులు.. ఏమైందంటే?

Venkatesh: మన శంకర్ వరప్రసాద్ ఎఫెక్ట్.. వెంకీ పేరును మార్చేసిన అభిమానులు.. ఏమైందంటే?
Advertisement

Venkatesh:  ఇటీవల కాలంలో స్టార్ హీరోల సినిమాలలో ఇతర హీరోలు క్యామియో పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో మరొక స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ (Venkatesh) కూడా నటించి సందడి చేశారు. ఈయన ఈ సినిమాలో 25 నిమిషాల పాటు స్క్రీన్ పై సందడి చేశారు .వెంకటేష్, చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన పాట అలాగే సీన్లు కూడా సినిమాకు హైలైట్ అయ్యాయి. ఈ సినిమా జనవరి 12వ తేదీ సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి మంచి సక్సెస్  అవ్వడంతో మెగా విక్టరీ అభిమానులు ఈ సక్సెస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

వెంకటేష్ పేరు మార్చేసిన అభిమానులు…

ఇక ఈ సినిమాకు మంచి ఆదరణ రావడమే కాకుండా మూడు రోజుల వ్యవధిలో ఏకంగా 150 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం కూడా సక్సెస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి, చిరంజీవి కలిసి ఒక ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా అనిల్ రావిపూడి ఈ సినిమా చూసిన తర్వాత వెంకటేష్ గారి కుటుంబ సభ్యుల రియాక్షన్ గురించి అడిగి తెలుసుకున్నారు. తన ఫ్యామిలీ మెంబర్స్ ఈ సినిమా చూసి చాలా బాగా ఎంజాయ్ చేశారని తెలిపారు.

నీరజ గౌడ..

Advertisement

ముఖ్యంగా మా ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ చాలా ఇష్టపడ్డారని ఇద్దరినీ ఒకే ఫ్రేమ్ లో చూసి తన ఫ్యామిలీ మెంబర్స్ సంతోషం వ్యక్తం చేశారని వెంకటేష్ తెలియజేశారు. ఈ సినిమా చూసిన తర్వాత అభిమానులందరూ తనకు పేరు మార్చేసారని ప్రతి ఒక్కరూ తనని వెంకీ మామ నుంచి వెంకీ గౌడ(Venky Gowda) అంటూ పిలవడం మొదలుపెట్టారని వెంకటేష్ తెలియజేశారు. ఇటీవల ఓ సందర్భంలో మా మిస్సెస్ ని కూడా నీరజ గౌడ అంటూ పిలుస్తున్నారని వెంకటేష్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇలా మన శంకర వరప్రసాద్ గారు సినిమా తర్వాత వెంకటేష్ ను ముద్దుగా వెంకీ మామ అంటూ పిలుచుకునే వారందరూ వెంకీ గౌడ అంటూ పిలుస్తున్నారని తెలిసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

నిర్మాతగా సుస్మిత కొణిదేల..

Advertisement

ఇలా వెంకటేష్ చిరంజీవి కాంబినేషన్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా వీరిద్దరి కాంబినేషన్లో ఫుల్ లెంగ్త్ సినిమా వస్తే బాగుంటుంది అంటూ వారి అభిప్రాయాలను కూడా తెలియజేశారు. మరి అభిమానుల కోరిక ఎప్పుడు నెరవేరబోతుందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా నయనతార నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా షైన్ స్క్రీన్ బ్యానర్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సుస్మిత కొణిదెల,సాహు గారపాటి నిర్మాతలుగా వ్యవహరించారు.

Also Read: Surekha On MSVPG Film: శంకర్ వరప్రసాద్ మూవీ పై సురేఖ రియాక్షన్.. ఆ అనుభవమే ఉందంటూ!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×