BCCI ON MS DHONI: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ( Mahendra Singh Dhoni ) ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ప్రపంచంలో ఏ క్రీడాకారునికి కూడా ఇంత రియల్ బేస్ అభిమానులు లేరు. మహేంద్ర సింగ్ ధోని కోసం ప్రాణాలు కూడా ఇచ్చేస్తారు. 2007 సమయంలో టీమిండియా కెప్టెన్ గా బాధ్యతలు వహించిన మహేంద్రుడు… 2013 వరకు టీమిండియాను అగ్రశ్రేణి జట్టుగా నిలిపాడు. ఈ క్రమంలో మూడు ఐసీసీ ట్రోఫీలు కూడా టీమిండియాకు అందించిన మొనగాడు ధోని.
తాను కెప్టెన్ గా ఉన్నన్ని రోజులు చాలా కూల్ గా ఉన్న ధోని.. పలు సందర్భాల్లో కోపానికి లోనైన సిచువేషన్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి తాజాగా టీమిండియా ఒకప్పటి ప్రముఖ మేనేజర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహేంద్రసింగ్ ధోని గనక తమిళనాడులో పార్టీ పెడితే.. సీఎం విజయ్ కూడా చిత్తుగా ఓడిపోవడం గ్యారంటీ అని తెచ్చరించారు. 100 మంది స్టాలిన్ అలాగే విజయ్ కు వచ్చినా కూడా మహేంద్రసింగ్ ధోని విజయాన్ని అడ్డుకోలేరని కుండ బద్దలు కొట్టి చెప్పారు.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని గురించి ఒకప్పటి ఇండియన్ ప్రముఖ మేనేజర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మహేంద్ర సింగ్ ధోనీకి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ బేస్ ఉందని వెల్లడించారు. అందుకే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఫాలోయింగ్ పెరిగిందన్నారు. మహేంద్ర సింగ్ ధోని కారణంగానే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు అత్యంత ప్రాధాన్యత లభించిందన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు వ్యూవర్స్ రావడానికి కూడా ధోని ఒక్కడే కారణం అన్నారు. అలాంటి మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఉండడం అదృష్టం అన్నారు. తమిళనాడు రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ధోని ముఖ్యమంత్రి కావడం గ్యారెంటీ అని సంచలన ప్రకటన చేశారు. ఇటీవల హీరో విజయ్ ముఖ్యమంత్రి అయినట్లుగానే.. మహేంద్ర సింగ్ ధోని ( MS DHONI) కూడా ముఖ్యమంత్రి కావడం పక్కా అంటూ వెల్లడించారు.
మహేంద్ర సింగ్ ధోనీకి అస్సలే కోపం రాదని ఒకప్పటి ప్రముఖ టీమిండియా ( Team India) మేనేజర్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీమిండియా జట్టును చాలా చక్కగా డీల్ చేసేవాడని గుర్తు చేశారు. దాదాపు పది సంవత్సరాల పాటు టీం ఇండియా కెప్టెన్ గా ఉన్న మహేంద్రుడు.. ఒకసారి కూడా కోపానికి లోను కాలేదని వివరించారు. అందుకే మహేంద్ర సింగ్ ధోని ( MS DHONI) ఇప్పటికీ ఎప్పటికీ గొప్ప కెప్టెన్ అంటూ కితాబు ఇచ్చారు.