Missterious Movie Completes Censor: బిగ్ బాస్ ఫేం, నటుడు రోహిత్, నటి మేఘన రాజపుత్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘మిస్టీరియస్’. సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మహి కోమటిరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అశ్లీ క్రియేషన్స్ పై జయ్ వల్లందాస్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్దమవుతుంది. మూవీ రిలీజ్ టైం దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ని వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో మూవీ తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మూవీ మీడియా సమావేశం నిర్వహించి సినిమా విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మహి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమా చాలా బాగా వచ్చిందన్నారు.
సస్పెన్స్ థ్రిల్లర్గా వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకుడిని ఆద్యాంతం ఆకట్టుకుంటుంది. ఒక కొత్త స్క్రిన్ప్లే తో పూర్తితో సస్పెన్స్ థ్రిల్లర్గార ఊపొందిస్తున్నారు. థియేటర్కి వచ్చిన ప్రతి ప్రేక్షకుడికి ఈ సినిమా ఒక కొత్త అనుభూతి ఇస్తుంది. ఇటీవల ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. మా సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. డిసెంబర్ 12న ఈ చిత్రం ప్రపంవ్యాప్తంగా విడుదల కానుంది. దాదాపు 150 థియేటర్లలలో ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జరుగుతున్నట్టు నిర్మాత జయ్ వల్లందాస్ చెప్పారు. దీనికి ఉషా సహా నిర్మాత వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె కూడా మాట్లాడారు. ఈ సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాం. టీజర్ అందరికీ నచ్చడం సంతోషంగా ఉంది.