E-Paper
Advertisement

Prakash Raj: కేరళ రాష్ట్ర అవార్డులు.. ప్రకాశ్ రాజ్ పై చైల్డ్ ఆర్టిస్టు ఫైర్

Prakash Raj: కేరళ రాష్ట్ర అవార్డులు.. ప్రకాశ్ రాజ్ పై చైల్డ్ ఆర్టిస్టు ఫైర్
Advertisement

Child Artist Slams Prakash Raj: ఈరోజుల్లో డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ నిజంగా కళాకారుడు కోరుకునేది కొన్ని చప్పట్లు మాత్రమే. ఆ చప్పట్లు చాలామంది కళాకారుల ఆకలిని తీరుస్తాయి. చాలామంది మంచి పేరు గుర్తింపు సంపాదించుకోవాలి అనే ఉద్దేశంతోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంటారు. వాటి కోసమే అహర్నిశలు కష్టపడి తమ ప్రతిభను బయటపెడుతుంటారు. అయితే ఒక సినిమా కమర్షియల్ సక్సెస్ సాధించడంతోపాటు ఆ సినిమాకి అవార్డులు వస్తే ఆ సినిమాలో నటించిన నటీనటులకు సంతృప్తి ఉంటుంది. అందుకనే ప్రతి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రతిష్టాత్మకమైన అవార్డులు ఇస్తూ ఉంటారు. అయితే కేరళ రాష్ట్రం కూడా ప్రతిష్టాత్మకమైన అవార్డులు ప్రకటించింది. 

9 విభాగాల్లో అవార్డ్స్

Advertisement

అయితే కేరళ రాష్ట్రానికి సంబంధించిన అవార్డుల ఎంపికలో ప్రకాష్ రాజు జ్యూరీ సభ్యులుగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలోనే ఈ అవార్డుల ఎంపిక జరిగిది. 2024లో వచ్చిన అన్ని చిత్రాలలో కూడా మంజుమ్మెల్ బాయ్స్ సినిమా ఎక్కువ అవార్డు సాధించుకుంది. ఏకంగా తొమ్మిది విభాగాల్లో ఈ సినిమాకు సంబంధించి అవార్డులు వచ్చాయి. ఈ సినిమాను వాస్తవంగా జరిగిన ఒక సంఘటనను ఆధారంగా తీసుకొని తెరకెక్కించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. ముఖ్యంగా గుణ సినిమాలోని ఇళయరాజా పాట ఈ సినిమాతోనే ఎక్కువగా పాపులర్ అయింది. తర్వాత ఇళయరాజా కూడా ఈ సినిమా గురించి కంప్లైంట్స్ ఇచ్చారు అది ప్రస్తుతం అప్రస్తుతం. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కూడా ఉత్తమ నటుడుగా ఎంపికైన విషయం తెలిసిందే. అయితే ఇంతమందికి అవార్డులు వచ్చినా కూడా చైల్డ్ ఆర్టిస్టులు ఈ అవార్డుల పైన విమర్శలు చేశారు.

చైల్డ్ ఆర్టిస్టుల విమర్శలు

నటులు అంటే ఏజ్ తో సంబంధం లేకుండా అందరికీ వర్తిస్తుంది. అయితే కేవలం పెద్దవాళ్ళని మాత్రమే గుర్తించారు బాలనటులను గుర్తించలేదు అని దేనానంద జిబిన్ సోషల్ మీడియాలో జ్యూరీని విమర్శించారు. మాలికాపురం, గు వంటి సినిమాల్లో మంచి పేరు సంపాదించుకుంది బాలనటి దేనానంద జిబిన్. అయితే ఏకంగా బాలనట్టులను పక్కకు పెట్టేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

సోషల్ మీడియా పోస్ట్

Advertisement

సోషల్ మీడియాలో చిన్న పిల్లలకు పోస్ట్ చేసే అవకాశం లేదు కాబట్టి తమ తల్లిదండ్రుల అకౌంట్ ద్వారా దేవానంద తన ఇన్ స్ట్రామ్ వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది. మీ కళ్ళతో పిల్లల్ని దగ్గరగా చూడండి. అంతేకానీ ఇక్కడ అంతా చీకటిగా ఉంది అని మాత్రం చెప్పకండి. పిల్లలు కూడా ఈ సమాజంలో భాగమే రాబోయే తరానికి 2024 మలయాళ సినిమాలు అవార్డులు ప్రకటించడంలో జ్యూరీ కళ్ళు మూసుకుపోయాయి. ఎన్నో సినిమాల్లో పిల్లల నటించారు కానీ ఆ పిల్లలకు అవార్డులు ఇవ్వకుండా కూర్చోవటం కరెక్ట్ కాదు. పిల్లలు మరిన్ని సినిమాలు చేయడానికి ప్రయత్నించండి. కనీసం ఇద్దరూ చైల్డ్ ఆర్టిస్టుల కైనా అవార్డులు ఇచ్చి ఉంటే అది నాలాంటి వాళ్ళకి ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చేది అంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×