E-Paper
Advertisement

Chiranjeevi: మాట్లాడడానికి ఏం లేదు.. బాలయ్య వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన మెగాస్టార్‌

Chiranjeevi: మాట్లాడడానికి ఏం లేదు.. బాలయ్య వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన మెగాస్టార్‌

Chiranjeevi at Hyderabad Airport: నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలపై మెగాస్టార్చిరంజీవి మరోసారి స్పందించారు. తాజాగా ఇండియాఉ వచ్చిన ఆయన ఎయిర్పోర్టులో విలేకరులు దీనిపై ప్రశ్నించారు. దీనిక చిరు ఇచ్చిన రియాక్షన్షాకిస్తుంది. ఏపీ అసెంబ్లీలో ఇటీవల బాలక్రష్ణ మాజీ సీఎం జగన్ని ఉద్దేశిస్తూ మాట్లాడారు. క్రమంలో కరోనా సమయంలో సినిమా సమస్యలపై మాట్లాడానికి వెళ్లిన మెగాస్టార్చిరంజీవిని అవమానించారని, వైఎస్జగన్ సైకో అని వ్యాఖ్యానించారు. అయితే బాలయ్య వ్యాఖ్యలపై వెంటనే చిరు స్పందించారు. ఆయన కామెంట్స్ని ఖండిస్తూ జగన్తనని అవమానించలేదని స్పష్టం చేశారు.

మాట్లాడటానికి ఏం లేదు.. 

దీనిపై వివరణ ఇస్తూ పత్రిక ప్రకటన ఇచ్చారు. నందమూరి బాలకృష్ణ మాటలను నేను టీవీలో చూశాను. ఆయన వ్యాఖ్యలు ఒకింత వ్యంగ్యం అనిపించాయని లేఖలో పేర్కొన్నారు. ఆయన ఇండియాలో లేకపోవడంతో స్టెట్మెంట్ఇచ్చారు. తాజాగా వెకేషన్నుంచి వచ్చిన ఆయన హైదరాబాద్ఎయిర్పోర్టు దగ్గర విలేకరులతో ముచ్చటించారు. సందర్భంగా బాలకృష్ణ వ్యాఖ్యలపై ఆయన అభిప్రాయం ఏంటని ప్రశ్నించారు. అయితే విలేకరులను ప్రశ్నలను ఆయన దాటవేశారు. ఇప్పటికే చెప్పాల్సింద చెప్పేశానని, ఇక మాట్లాడాల్సింది ఏం లేదని అన్నారు. ఇక హైదరాబాద్ఎయిర్పోర్టుకి వచ్చిన ఆయన అభిమానులకు సెల్ఫీలు ఇస్తూ సందడి చేశారు.

కాగా చిరు తన ప్రకటనలో ఇలా అన్నారు. “అసెంబ్లీలో బాలకృష్ణ ఒకింత వ్యంగ్యం మాట్లాడటం టీవీలో చూశా. నా పేరు ప్రస్థావనకు వచ్చింది కాబట్టి వివరణ ఇస్తున్నా. నన్ను లంచ్‌కి రావాలని జగన్‌ స్వయంగా ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేరకు ఆయన ఇంటికి వెళ్లాను. ఆయన నన్ను సాదరంగా ఆహ్వానించారు. లంచ్చేస్తుండగా.. సీఎం జగన్గారితో ఇండస్ట్రీ సమస్యల గురించి ప్రస్తావించాను. సమయం ఇస్తే అందరం కలిసి వస్తామంటే సరే అన్నారు. కోవిడ్‌ కారణంగా ఐదుగురు మాత్రమే రావాలన్నారు. కానీ, మేము పదిమంది వస్తామంటే ఆయన సరే అన్నారు. డేట్‌ ఫిక్స్‌ చేసి మమ్మల్ని రమ్మన్నారు. 

Also Read: Sudigali Sudheer: పాన్ఇండియా ప్రాజెక్ట్తో వస్తున్న సుడిగాలి సుధీర్‌.. టైటిల్ఇదే!

వైఎస్ జగన్ అవమానించలేదు.. 

అప్పుడు నేను బాలకృష్ణ గారిని ఫోన్‌ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాను. కానీ, ఆయన అందుబాటులోకి రాలేదు. జెమిని కిరణ్ గారిని వెళ్లి బాలకృష్ణ గారిని కలవమని చెప్పాను. ఆయన మూడుసార్లు ప్రయత్నించినా బాలకృష్ణ అందుబాటులోకి రాలేదు. దీంతో నేను ఒక ఫ్లైయిట్ ఏర్పాటు చేసి ఆర్ నారాయణ మూర్తి గారితో సహా మరి కొంతమందితో వెళ్లి ముఖ్యమంత్రి గారిని కలిశాము. ఆ సమయంలో నేను ముఖ్యమంత్రి గారితో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరించాను. ఇండస్ట్రీకి ప్రభుత్వ సహకారం అందించాలని కోరాను.టికెట్‌ ధరల పెంపు విషయమై మాట్లాడాం. ప్రభుత్వ నిర్ణయం వల్లే వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య మూవీ టికెట్‌ రేట్స్‌ పెరిగాయి. ఆయన ఇండస్ట్రీకి అన్ని విధాల సహకరిస్తామని చెప్పారు. నాతో పాటు అక్కడ ఉన్నవారి అందరిపట్ల ఆయన గౌరవంగా వ్యవహరించారు. ఎవరిని కూడా ఆయన అవమానించలేదు. నేను సాక్షిని” అని చిరు లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం వ్యవహరం ఇటూ ఇండస్ట్రీ అటూ పరిశ్రమలో సంచలనంగా మారాయి.

Related News

‘డాన్ 3’ వివాదం.. రణ్‌వీర్ సింగ్‌పై ఆర్డర్ ఉపసంహరణ.. ఇంకా ముగియని గొడవ!

మెగా పవర్ స్టార్ బాక్సాఫీస్ జాతర.. ఊళ్లో సంబరాలు మామూలుగా లేవుగా..

దీపికా పదుకొణె డిప్రెషన్‌పై ప్రకాష్ పదుకొణె ఎమోషనల్.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, సీబీఎఫ్‌సీ మాజీ చీఫ్ కన్నుమూత.. ఏం జరిగిందంటే?

‘పెద్ది’ రిలీజ్ తర్వాత రామ్ చరణ్‌ను చూసి మురిసిపోతున్న మెగాస్టార్.. ఏం అన్నారంటే?

హీరో అర్జున్ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు.. అల్లుడు ఎవరంటే..?

రామ్ చరణ్ ‘పెద్ది’ చూసిన తర్వాత సెలబ్రిటీల రియాక్షన్ ఇదే!..

ప్రకాష్ రాజ్‌కి బండ్ల గణేష్ ఇచ్చిపడేశాడుగా!.. ఏంటి బాసూ అలా అనేశావ్..

Big Stories

×