MSVPG Film Trailer: అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి(Chiranjeevi), నయనతార (Nayanthara)హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం మన శంకర వరప్రసాద్ గారు(MSVPG). సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుంచి మూడు పాటలను విడుదల చేయగా ఈ పాటలు సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేశాయి .ఇక త్వరలోనే ఈ సినిమా ట్రైలర్ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ తేదీని ప్రకటిస్తూ చిత్ర బృందం అధికారక ప్రకటన తెలియజేశారు.
చేతిలో గన్ పట్టుకొని చిరు పవర్ ఫుల్ యాక్షన్ సన్నివేశానికి సంబంధించిన పోస్టర్ విడుదల చేస్తూ ఈ సినిమా ట్రైలర్ జనవరి 4వ తేదీ విడుదల చేయబోతున్నట్లు తెలియజేశారు. ఈ సినిమా ట్రైలర్ జనవరి 4వ తేదీ విడుదల చేయగా ఈ సినిమాని జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు చిత్ర బృందం అధికారకంగా వెల్లడించడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు షైన్ స్క్రీన్, గోల్డెన్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సాహు గారు పాటి, సుస్మిత కొణిదెల నిర్మాతలుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.
ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చాలా సంవత్సరాల తర్వాత చిరంజీవిని ఇలాంటి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో చూడటం కోసం అభిమానులు కూడా ఎంతో ఆతృత కనపరుస్తున్నారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి NIA అధికారిగా కనిపించబోతున్నారు. ఇక నయనతార విషయానికి వస్తే శశిరేఖగా నయనతార కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో మరొక స్టార్ హీరో వెంకటేష్(Venkatesh) కూడా క్యామియో పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో ఇటీవల మాస్ సాంగ్ కూడా విడుదల చేశారు ఈ పాట ఇప్పటికే 20 మిలియన్లకు పైగా వ్యూస్ కైవసం చేసుకుంది.
https://twitter.com/i/status/2006999067612819884
వెంకటేష్ ఈ సినిమాలో దాదాపు అరగంట పాటు స్క్రీన్ పై ఉండబోతున్నారని వీరిద్దరి కాంబోలో వచ్చే సన్నివేశాలు సినిమాను మరో లెవెల్ కు తీసుకెళ్తుందని డైరెక్టర్ ప్రమోషన్లలో తెలియజేస్తున్నారు.. మొత్తానికి చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి సంక్రాంతి సందర్భంగా చిరంజీవి ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది. ఇక గత ఏడాది అనిల్ రావిపూడి వెంకటేష్ తో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఈ నేపథ్యంలోనే మన శంకర వరప్రసాద్ గారి సినిమాపై కూడా అదే అంచనాలు ఏర్పడ్డాయి.
Also Read: Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ రిలీజ్ పై క్లారిటీ.. ఆకట్టుకున్న న్యూ ఇయర్ పోస్టర్ !