Nutan Naidu: తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ కింగ్ మేకర్గా, బిగ్బాస్ ఫేమ్గా గుర్తింపు పొందిన డాక్టర్ నూతన్ నాయుడు అంతర్జాతీయ వేదికపై సరికొత్త రికార్డు సృష్టించారు. ప్రముఖ ఫ్రాంక్ఫర్డ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆయనకు ‘ఆర్గనైజేషనల్ న్యూరోసైన్స్ అండ్ ఏఐ ఎథిక్స్’ విభాగంలో ప్రతిష్టాత్మక ప్రొఫెసర్షిప్ను, నాలుగో డాక్టరేట్ను ప్రదానం చేసింది. ఈ విభాగంలో ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్న తొలి భారతీయుడు ఆయనే కావడం విశేషం.
రాజకీయ వ్యూహకర్తగా..
డాక్టర్ నూతన్ నాయుడు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జనసేన, కాంగ్రెస్, బీసీ వై పార్టీలకు పొలిటికల్ అడ్వైజర్గా వ్యవహరించి, ఆయా పార్టీల విజయాల్లో కీలక పాత్ర పోషించారు. ప్రాంతీయంగానే కాకుండా, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి సైతం ఎన్నికల వ్యూహకర్తగా, పొలిటికల్ అడ్వైజర్గా పనిచేసిన అపార అనుభవం ఆయన సొంతం.
గ్లోబల్ లీడర్లకు సలహాదారుడిగా..
అంతేకాదు, అంతర్జాతీయంగా పలు దేశాల ప్రధానులకు, అధ్యక్షులకు సైతం ఆయన రాజకీయ, సాంకేతిక సలహాదారుడిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా న్యూఢిల్లీలో జరిగిన ఒక హై-ప్రొఫైల్ సదస్సులో, ప్రపంచ మేధావుల సమక్షంలో ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ అంతర్జాతీయ గుర్తింపు పట్ల తెలుగు ప్రజలు మరియు ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.