Naga Chaitanya:సాధారణంగా ఒక హీరో సినిమా విడుదల అవుతోంది అంటే ఆయన గత చిత్రాల ఫలితాలను , వాటి కలెక్షన్లను దృష్టిలో పెట్టుకొని ఆయా చిత్రాలకు బిజినెస్ జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే నాగచైతన్య చివరిగా తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి, మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా ఇచ్చిన ధైర్యమే ఆయనకు మంచి మార్కెట్ ను అందిస్తోంది అని చెప్పాలి. తాజాగా వృషకర్మ చిత్రంలో నాగచైతన్య హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకి కళ్ళు చెదిరే నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు సమాచారం.
అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ వృషకర్మ సినిమా విడుదల కాకముందే.. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ఇండస్ట్రీ వర్గాలలో అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాకు సంబంధించిన నాన్ థియేట్రికల్ హక్కులు భారీ ధరకు అమ్ముడుపోయాయి అన్నట్లు ఫిలిం ఇండస్ట్రీలో గట్టిగా టాక్ నడుస్తోంది . ప్రముఖ ఓటీటీ, శాటిలైట్ సంస్థ అయిన జీ ఛానెల్ ఈ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ ను సుమారుగా రూ.50 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పోస్ట్లు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రూ.50 కోట్ల భారీ డీల్ కుదరడంతో ఈ సినిమా బడ్జెట్లో సగానికి పైగా మొత్తం కేవలం ఈ రైట్స్ ద్వారానే రికవరీ అయిపోయిందనే కామెంట్లు కూడా వినిపిస్తూ ఉండడం గమనార్హం.
ముఖ్యంగా మ్యూజికల్ రైట్స్ ,హిందీ డబ్బింగ్ శాటిలైట్ హక్కులు కూడా కలిపితే బడ్జెట్లో మెజారిటీ భాగం ఈ ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారానే వెనక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఖండాలు సినిమాతో ఆయన అందుకున్న బ్లాక్ బస్టర్ విజయం కారణంగానే ఆయన తదుపరి చిత్రానికి ఈ రేంజ్ లో బిజినెస్ జరిగిందనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
ఇకపోతే విరూపాక్ష సినిమాతో సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ దండు.. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మైథాలజికల్ మిస్టరీ థ్రిల్లర్ జానర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటిస్తోంది. డైరెక్టర్ మార్క్ సస్పెన్స్ ఎలిమెంట్స్, మిస్టికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ALSO READ:‘బేబీ’ సినిమా డబ్బులు ఇంకా రాలేదంటూ బాంబు పేల్చిన ఎస్కేఎన్!
మరొకవైపు నాగచైతన్య మసూద డైరెక్టర్ సాయికిరణ్ దర్శకత్వంలో హారర్ థ్రిల్లర్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలను చైతూ టీం పూర్తిగా ఖండించింది. వీరిద్దరి మధ్య ఎలాంటి కథా చర్చలు జరగలేదని స్పష్టం చేసింది. ఇకపోతే నాగచైతన్య దూత -2 అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నారు.