The Paradise Movie: నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ది ప్యారడైజ్(The Paradise). ఈ సినిమా సెప్టెంబర్ 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇక ఈ సినిమా విడుదలకు నాలుగు రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో విడుదలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ 21వ తేదీ శిల్పకళా వేదిక హైదరాబాదులో జరగబోతున్న సంగతి తెలిసిందే మరి కాసేపట్లో నైజాం ఏరియాలో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అవుతున్నాయి.
ఇలా ఈ సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అవుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) నుంచి చిత్ర బృందానికి గుడ్ న్యూస్ వచ్చింది. ఈ సినిమా టికెట్ ధరలను పెంచడానికి తెలంగాణ గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. భారీ బడ్జెట్ సినిమాకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు టికెట్ ధరలను పెంచాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని చిత్ర బృందం కోరారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఈ సినిమా టికెట్ ధరలు పెంపుకు అనుమతి లభించిందని తెలుస్తుంది. మరి ఈ సినిమా ప్రీమియర్లకు అలాగే సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్ లకు ఎంత మొత్తంలో టికెట్ ధరలను పెంచారు అనే విషయానికి వస్తే..
ది ప్యారడైజ్ సినిమా ప్రీమియర్లు సెప్టెంబర్ 23వ తేదీ ప్రసారం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రీమియర్ టికెట్ ధరలను జీఎస్టీ లతో కలిపి 500 రూపాయలు నిర్ణయించింది. అలాగే ఈ సినిమా 24వ తేదీ నుంచి సెప్టెంబర్ 27వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లకు రూ. 48 , మల్టీప్లెక్స్ థియేటర్లకు రూ.95/జిఎస్టి లతో కలిపి పెంచేశారు. ఇక సెప్టెంబర్ 28వ తేదీ నుంచి అక్టోబర్ మూడవ తేదీ వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.23 , మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.45 ఉంటాయని తెలంగాణ ప్రభుత్వం తెలియజేసింది. ఇక అక్టోబర్ 4వ తేదీ నుంచి పెంచిన ధరలు అందుబాటులో ఉండవని తెలియజేశారు.
ఇలా ఈ సినిమా టికెట్ ధరలను పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి తెలపడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏపీలో కూడా ఈ సినిమా టికెట్ ధరలను పెంచాలని ఏపీ ప్రభుత్వాన్ని కూడా కోరారు. మరి ఏపీలో ఈ సినిమా టికెట్ ధరలు పెరుగుతాయా?లేదంటే యధావిధిగా కొనసాగుతాయా? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాని ఎస్ఎల్వి సినీ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మించిన సంగతి తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని ఖయాదు లోహర్ జంటగా నటించారు. తల్లి కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.