SS Rajamouli : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక అద్భుతమైన సినిమాను చేయడంతో పాటు దానిని ప్రజల్లోకి తీసుకువెళ్లడం కూడా కీలకం. అయితే ఒక గొప్ప సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కూడా ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తాడు ఎస్.ఎస్ రాజమౌళి. తన సినిమాలు విపరీతంగా ప్రేక్షకులు ఆదరిస్తున్నారంటే కారణం, ఏ అంశాలు ప్రేక్షకులు ఇష్టపడతారు అనే క్లారిటీ రాజమౌళికి ఉండటం.
రాజమౌళి తన సినిమాల విషయంలో చాలా క్లారిటీ తీసుకుంటారు. అంత ఈజీగా దేనికి ఒప్పుకోరు. అతను కంప్లీట్ గా సంతృప్తి పొందితే తప్ప ఒక సన్నివేశాన్ని ఓకే చేయరు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా రాజమౌళి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు కెరియర్ లో వస్తున్న 29వ సినిమా. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ సినిమాకి సంబంధించిన భారీ ఈవెంట్ నవంబర్ 15న జరగబోతున్న సంగతి తెలిసిందే. గతంలో సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్ డేకు గాని, మహేష్ బాబు బర్త్డేకు గాని ప్రేక్షకులు అభిమానులు ఊహించిన విధంగా ఏ అప్డేట్ ఇవ్వలేదు.
అయితే నవంబర్ నెలలో ఈ సినిమాకి సంబంధించిన ఒక ఈవెంట్ చేస్తున్నట్లు అప్పట్లో అనౌన్స్ చేశారు. ఇంకో ఐదు రోజుల్లో ఈ ఈవెంట్ మొదలుకానుంది. ఈ ఈవెంట్ కి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు తెలుస్తున్నాయి.
ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్ కు మీడియాకు సంబంధించిన కెమెరాలుకు అనుమతి లేనట్లు తెలుస్తుంది. అయితే దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక పెద్ద సినిమా వచ్చినప్పుడు ఒక ఇండోర్ స్టేడియంలో భారీగా ఈవెంట్ నిర్వహిస్తారు. ఆ ఈవెంట్ కి సంబంధించి లైవ్ వీడియో ఎప్పుడు ఇవ్వరు.
ఆ ఈవెంట్ అంతా రికార్డ్ అయిన తర్వాత కొన్ని రోజులకు టీవీలో ప్రాపర్ ఎడిటింగ్ చేసి టెలికాస్ట్ చేస్తారు. ఈ ఈవెంట్ కూడా అదే బాటలో చేస్తారేమో అని ఆలోచనలు చాలామందికి వస్తున్నాయి. మరి ఈ సినిమా విషయంలో రాజమౌళి ఏం చేస్తారో చూడాలి.
ఈ ఈవెంట్ కి సంబంధించి ఒక పాటను కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు. ఆ పాటకి విపరీతమైన రెస్పాన్స్ కూడా వస్తుంది. కీరవాణి కంపోజ్ చేసిన ఈ పాటను శృతిహాసన్ పాడారు. ఈ పాట ఇప్పుడు వైరల్ గా మారింది.
Also Read: 50 Years Of MohanBabu : మోహన్ బాబుకు గ్రాండ్ ఈవెంట్, ఈసారి ఏ వైరల్ స్పీచ్ ఇస్తారో?