Bramhanandam: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక ఫోటో రాజకీయ వర్గాల్లోనే కాకుండా సినీ అభిమానుల్లో కూడా ప్రస్తుతం తెగ ఆసక్తి తీసుకొస్తుంది. ఆ ఫోటోలో మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ప్రముఖ హాస్యనటుడు..కామెడీ కింగ్..గా పేరొందిన బ్రహ్మానందంతో కలిసి కనిపించాడు. ఈ అనుకోని భేటీ చాలా మందిని ఆశ్చర్యపరిచింది.
దీంతో అసలు వీళ్ళిద్దరూ ఎందుకు కలిశారు అన్న అనుమానాలు సోషల్ మీడియాలో మొదలైపోయాయి. అసలు విషయానికి వస్తే.. ఈ సంఘటన గన్నవరం విమానాశ్రయంలో జరిగింది. ఒకే సమయంలో ఇద్దరూ అక్కడ ఉండటంతో పరస్పరం కలుసుకున్నారు. ఆ సమయంలో తీసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ఆ చిత్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బ్రహ్మానందం చేతిని ప్రేమగా పట్టుకుని మాట్లాడుతున్నట్లు కనిపిస్తుండగా.. బ్రహ్మానందం ముఖంలో చిరునవ్వు కనిపిస్తోంది. ఈ దృశ్యం చూసిన వారికి హాయిగా అనిపిస్తోంది.
ప్రస్తుతం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో వారానికి ఒకసారి పర్యటనలు చేస్తూ ప్రజలతో భేటీ అవుతున్నారు. ఈ పర్యటనల సమయంలో రాజకీయ అంశాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో బ్రహ్మానందం లాంటి సినీ దిగ్గజంతో ఆయన కలవడం ప్రత్యేకతను సంతరించుకుంది. రాజకీయాలు, సినిమా రెండూ వేర్వేరు రంగాలైనా ఈ కలయిక ప్రజల దృష్టిని ఆకర్షించింది.
ఇంతకుముందు కూడా..2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘన విజయం సాధించిన తర్వాత బ్రహ్మానందం ఆయనపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా జగన్ చేసిన పాదయాత్రను ఆయన చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు. అప్పట్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి చర్చకు వచ్చాయి. ఈ కారణంగా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉందని పలువురు భావిస్తున్నారు.
ఈ ఫోటో బయటకు రావడంతో వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకుడు, సినీ నటుడు ఇలా అనుకోకుండా కలవడం చాలా అరుదుగా జరుగుతుందని వారు చెబుతున్నారు. కొందరు దీనిని కేవలం సాధారణ భేటీగా చూస్తే, మరికొందరు మాత్రం దీని వెనుక ఏదైనా సందేశం ఉందేమో అని చర్చిస్తున్నారు.
గన్నవరం విమానాశ్రయంలో జరిగిన ఈ అనుకోని భేటీ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. రాజకీయాలు, సినిమా వేర్వేరు రంగాలైనా ఇలాంటి క్షణాలు ప్రజలకు మంచి అనుభూతిని కలిగిస్తాయని చెప్పవచ్చు.
ALSO READ: Prabhas: విజయవాడ వస్తే వాటిని తినాల్సిందే.. ప్రభాస్ కు ఇష్టమైన స్నాక్స్ అవేనా?