E-Paper
Advertisement

Jammu Kashmir Cloudburst: జమ్ము కశ్మీర్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. 11మంది మృతి, పలువురికి గాయలు..

Jammu Kashmir Cloudburst: జమ్ము కశ్మీర్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. 11మంది మృతి, పలువురికి గాయలు..
Advertisement

Jammu Kashmir Cloudburst: జమ్ము కశ్మీర్‌లో మరోసారి క్లౌడ్ బరస్ట్ సంభవించింది. భారీ వర్షాల కారణంగా రాంబాన్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి 11 అక్కడికక్కడే మృతి చెందారు.. అలాగే శిథిలాల కింద మరికొంత మంది ఉన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ఘటనలో మరణించిన వారిలో ఐదుగురు 12 ఏళ్లలోపు చిన్నారులు ఉన్నట్లు గుర్తించారు.

ఈ ఘటనపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ జిల్లా కమిషనర్‌తో మాట్లాడి, అన్ని సాధ్యమైన సహాయాలను అందిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి ఓమర్ అబ్దుల్లా తక్షణ రెస్క్యూ, రిలీఫ్ చర్యలను ఆదేశించారు.

Advertisement

అయితే భారీ వర్షాలు, క్లౌడ్ బరస్ట్ రాజ్‌గఢ్ ప్రాంతంలోని గడ్‌గ్రామ్ పాకెట్‌లో ఇళ్లను దెబ్బతీశాయి. అక్కడి ప్రాంతంలో వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి, ఇది విస్తృతమైన నష్టానికి దారితీసింది. జమ్ము-శ్రీనగర్ నేషనల్ హైవే ఐదు రోజులుగా మూసివేయబడింది. దీంతో ఉధంపూర్ జిల్లాలోని జఖేని, చెనాని మధ్య కొండచరియల కారణంగా 2,000 కంటే ఎక్కువ వాహనాలు చిక్కుకుపోయాయి. అంతేకాకుండా జమ్ము ప్రాంతంలో తొమ్మిది ఇంటర్-డిస్ట్రిక్ట్ రోడ్లు మూసివేయబడ్డాయి, డజన్ల కొద్దీ గ్రామాలు కట్ ఆఫ్ అయ్యాయి.

Also Read: అయ్యబాబోయ్.. బంగారం ధరలు ఒక్కసారిగా ఇంత పెరిగిందేంటి?

Advertisement

గత రెండు వారాల్లో115 మరణాలు..
గత రెండు వారాల్లో, తీవ్రమైన వర్షాలు, క్లౌడ్ బరస్ట్‌లు, కొండచరియలు జమ్ము ప్రాంతంలో గణనీయమైన వినాశనానికి కారణమయ్యాయి. మొత్తం 115 కంటే ఎక్కువ మరణాలు సంభవించాయి. ప్రధానంగా యాత్రికులు, కిష్ట్వార్‌లోని మచైల్ మాత యాత్రలో 65 మరణాలు, జమ్ములోని మాత వైష్ణోదేవి దేవాలయం సమీపంలో 30 మరణాలు, రాంబాన్ , రీసీలలోని సంఘటనలు 11 మంది మరణాలకు దారితీశాయి. ఈ ఘటనపై సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రజలు ల్యాండ్‌స్లైడ్-ప్రోన్ ప్రాంతాలలో ప్రయాణించకుండా ఉండాలని, నదులు, నాలాల నుండి దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అలాగే అత్యవసర సమయంలో 112 సంప్రదించండని తెలిపారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

ఢిల్లీలో హై టెన్షన్.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నివాసానికి భారీ భద్రత, బారికేడ్లతో రోడ్లు బంద్!

Vande Mataram Bill: కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. వర్షాకాల సమావేశాల్లో ఆ కీలక బిల్లు?

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

Big Stories

Advertisement
×