BigTV English

Assam Floods: కజిరంగ పార్క్‌ను ముంచెత్తిన వరదలు..131 వన్యప్రాణులు మృత్యువాత

Assam Floods: కజిరంగ పార్క్‌ను ముంచెత్తిన వరదలు..131 వన్యప్రాణులు మృత్యువాత

Assam Floods: అస్సాంను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటివరకు ఆరు లక్షల మందికి పైగా వరదల బారిని పడ్డారు. ఈ వరదల ధాటికి కజిరంగ పార్కులో 131 వన్యప్రాణులు మృత్యువాత పడినట్లుగా అధికారులు వెల్లడించారు.


ఈ ఉదయం అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ ఎక్స్ వేదికగా స్పందించారు. కజిరంగ పార్కులోని వరదలో ఓ ఖడ్గ మృగం చిక్కుకుని ఇబ్బంది పడుతున్న వీడియో షేర్ చేశారు. దానిని వెంటనే రక్షించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రాన్ని ముంచెత్తుతున్న వరదలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వీరితో పాటు వన్యప్రాణుల ప్రాణాలు ప్రమాదాల్లో పడ్డాయని అన్నారు.

ఇక ఈ వరదల కారణంగా ఇప్పటివరకు 131 వన్యప్రాణులు మృత్యువాత పడినట్లు అధికారులు తెలిపారు. ఇందులో ఆరు ఖడ్గమృగాలు, 117 హాగ్ జింకలు, రెండు సాంబర్, ఒక మకాకు, ఇక ఒట్టర్ మృత్యువాత పడ్డాయి. ఇప్పటివరకు 97 వన్యప్రాణులను రక్షించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం 25 వన్యప్రాణులు మెడికల్ కేర్‌లో ఉన్నాయని.. 52 వన్యప్రాణులను ట్రీట్‌మెంట్ తర్వాత విడిచిపెట్టామని అధికారులు తెలిపారు.

2017లో వరదల వల్ల దాదాపు 350 వన్యప్రాణులు మృత్యువాత పడ్డాయి. డీఆర్ఎఫ్ బృందాలు ప్రతి ఒక్కరికి సహాయం చేయడానికి 24 గంటలు పని చేస్తున్నాయని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సోమవారం అన్నారు.

Tags

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×