Big Stories

Chhattisgarh Encounter: దద్ధరిల్లిన దండకారణ్యం.. 29 మంది మావోయిస్టులు హతం

Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. కాంకేర్ జిల్లాలో భద్రతా బలగాలకు- మావోయిస్టులకు మధ్య భీకర పోరు జరిగింది. ఈ కాల్పుల్లో 29 మంది మావోయిస్టులు హతమైనట్లు సమాచారం. కాగా కాల్పులు జరిగిన ప్రదేశంలో భద్రతా బలగాలు 4 ఏకే 47లు, పెద్ద ఎత్తున ఆయుధాలు, మందు గుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

కాగా ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు పోలీసులు గాయపడ్డారని కాంకేర్ జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లాలోని ఛోటేభేతియా అటవీ ప్రాంతంలో మావోల కదలికలు ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు కూంబింగ్ చేపట్టారు. దీంతో మావోలు తారసపడగా ఇరు వర్గాలు భీకర కాల్పులు జరపడంతో పెద్ద ఎత్తున మావోలు హతమయ్యారని సమాచారం.

- Advertisement -

10 మంది మృతదేహాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ ఎన్‌కౌంటర్‌లో టాప్ కమాండర్లు శంకర్‌రావు, లలిత ఉన్నట్లు సమాచారం. అటు మృతిచెందిన మావో కమాండర్ శంకర్‌రావు‌పై రూ. 25 లక్షల రివార్డ్ ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News