E-Paper
Advertisement

ఉత్తరాదిని ముంచెత్తుతున్న వానలు.. నదుల ఉగ్రరూపం, చార్‌ధామ్ యాత్ర వాయిదా!

ఉత్తరాదిని ముంచెత్తుతున్న వానలు.. నదుల ఉగ్రరూపం, చార్‌ధామ్ యాత్ర వాయిదా!
Advertisement

North India Rains: ఉత్తర భారతదేశాన్ని వానలు ముంచెత్తుతున్నాయి.. గత రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు ప్రధాన నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, గత 24 గంటల్లో ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో అత్యధికంగా 17.4 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. రాబోయే 24 గంటల్లో యూపీలోని 12 జిల్లాల్లో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోవైపు హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా, కాంగ్రా, కులు, మండి, సిర్మౌర్ జిల్లాలతో పాటు ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్, చంపావత్ జిల్లాలకు IMD రెడ్ అలర్ట్ ప్రకటించింది.

చార్‌ధామ్ యాత్ర వాయిదా..
వర్షాల దాటికి కొండ ప్రాంతాల్లో వరద తాకిడి తీవ్ర రూపం దాల్చింది. పలు చోట్ల కొండచరియలు విరిగిపడటంతో వందలాది లింక్ రోడ్లు, జాతీయ రహదారులు పూర్తిగా మూతపడ్డాయి. దీంతో రవాణా వ్యవస్థ స్తంభించిపోయి పర్యాటకులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నందున చార్‌ధామ్ యాత్రికులు, ఇతర పర్యాటకులు తమ ప్రయాణాలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. గంగా, యమునా, జీలమ్, సరయూ వంటి ప్రధాన నదుల నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.

Advertisement

రంగంలోకి NDRF, SDRF
కేవలం ఉత్తరాదిలోనే కాకుండా జమ్మూకశ్మీర్, అస్సాం రాష్ట్రాల్లోనూ వర్షాల తీవ్రత తీవ్రంగా ఉంది. నదులు పొంగిపొర్లుతుండటంతో అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద ముప్పు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సహాయక చర్యలను వేగవంతం చేయడానికి NDRF, SDRF బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. ముంపు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ, పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. జూలై 25 వరకు రుతుపవనాలు అత్యంత చురుగ్గా ఉంటాయని, అప్పటివరకు ప్రజలు అనవసర ప్రయాణాలు చేయకపోవడమే మంచిదని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.

ఎల్ నినో భయాల నడుమ ఉపశమనం..
ఈ ఏడాదంతా ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఉంటాయేమోనని అందరూ భయపడ్డారు. కానీ, జూలై నెలలో కురుస్తున్న ఈ విస్తారమైన వర్షాలు ఆందోళనలను కొంతవరకు పటాపంచలు చేశాయి. తాజాగా విడుదలైన శాటిలైట్ మ్యాప్‌ల ప్రకారం, భారత్‌పై దట్టమైన వర్షపు మేఘాలు కమ్ముకుని ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. తీవ్రమైన ఎండలు, ఎండగాలుల నుంచి ప్రజలకు ఇది ఎంతో కొంత ఊరటనిచ్చే అంశమే అయినప్పటికీ, ఒక్కసారిగా కురిసిన ఈ కుండపోత వర్షాలు వరద ముప్పుగా మారడం గమనార్హం.

Advertisement

ఉత్తరాదిలో వానల పండగ.. దక్షిణాదిలో పెరుగుతున్న ఆందోళన!
ఒకవైపు ఉత్తర భారతాన్ని వర్షాలు వణికిస్తుంటే, మరోవైపు దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం దీనికి పూర్తి భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దక్షిణాదిన ఆశించిన స్థాయిలో ఇంకా వర్షాలు కురవకపోవడంతో సౌత్ ఇండియా డేంజర్ జోన్‌లో ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రుతుపవనాల గమనం ఉత్తరాది వైపే ఎక్కువగా కేంద్రీకృతమవ్వడమే దీనికి ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాబోయే రోజుల్లో అయినా దక్షిణాదికి తగినంత వర్షపాతం అందుతుందో లేదో వేచి చూడాలి.

Also Read: పని లేదు.. సగం జీతమే ఇవ్వండి: IAS లేఖ

Related News

సూర్యుడు ఉదయాన్నే పెద్దగా ఎందుకు కనిపిస్తాడో ఎప్పుడైనా ఆలోచించారా ?

56 ఇంచుల ఛాతి.. 56 ఏళ్ల యువ‌కుడు… మ‌ధ్య‌లో జెన్‌-జీ కాక్రోచ్‌!

భేష్‌.. ఫండ్ పైస‌లు పంపిణీ.. బీఆరెస్ పార్టీ ఫండ్ నుంచి బాధిత రైతుల‌కు భ‌రోసా..

రూటు మార్చిన బీఆర్ఎస్.. జెన్-జి లక్ష్యంగా పాలిటిక్స్.. కేటీఆర్ వ్యూహం ఇదేనా?

తెగేదాక లాగ‌క‌పోవ‌డ‌మే మేలు..70వేల ఉద్యోగాల‌పై కేటీఆర్ వ్యూహంలో చిక్కుకున్న‌ కాంగ్రెస్!

QR కోడ్‌లో మూడు బాక్స్‌లు ఎందుకుంటాయో తెలుసా ?

బ‌ల‌వంత‌మైన స‌ర్ప‌ము బొద్దింకల చేత‌జిక్కి…!

Big Stories

Advertisement
×