Hydrogen Train Viral Video Explained: ఇండియన్ ఫస్ట్ హైడ్రోజన్ రైలు రీసెంట్ గా పట్టాలెక్కింది. ప్రధాని మోడీ ఈ రైలును అట్టహాసంగా ప్రారంభించారు. అయితే, తాజాగా ఈ రైలుపై కొందరు దుండగులు రాళ్లు విసురుతున్నట్లు కనిపించే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చాలా మంది ఈ వీడియో చూసి నిజంగానే హైడ్రోజన్ రైలుపై దాడి జరిగిందా? అని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా భారతీయ రైల్వే ఈ వైరల్ వీడియోపై క్లారిటీ ఇచ్చింది.
తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోకు హైడ్రోజన్ రైలుతో ఎలాంటి సంబంధం లేదని రైల్వే అధికారులు వెల్లడించారు. ఆ వీడియో పాతదని, అందులో కనిపిస్తున్నది హైడ్రోజన్ రైలు కాదని స్పష్టం చేశారు. వీడియోను కొత్త హైడ్రోజన్ రైలుకు సంబంధించినదిగా ప్రచారం చేయడం పూర్తిగా తప్పుదోవ పట్టించే ప్రయత్నమని తెలిపారు. నార్తర్న్ రైల్వే తన అధికారిక ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. వైరల్ వీడియోలో కనిపిస్తున్న రైలును WAG-12 లోకోమోటివ్ లాగుతున్నట్లు గుర్తించినట్లు తెలిపింది. అందువల్ల ఆ ఘటనను హైడ్రోజన్ రైలుతో లింక్ చేయడం కరెక్ట్ కాదని వెల్లడించింది. హైడ్రోజన్ రైలు ఎలాంటి అంతరాయం లేకుండా తన షెడ్యూల్ ప్రకారమే నడుస్తోందని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వీడియోను నిజమని నమ్మకుండా, అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ప్రజలకు సూచించింది. అదే సమయంలో ప్రయాణికులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.
आंदोलनतक ठीक है लेकिन सार्वजनिक संपत्ति को नुकसान क्यों? #ChaloSansad pic.twitter.com/PjI15CYVdm
— Er. Ram (@ItsEramX) July 20, 2026
ఇండియన్ ఫస్ట్ హైడ్రోజన్ రైలు హర్యానాలోని జింద్ జంక్షన్ నుంచి సోనిపట్ వరకు నడుస్తోంది. ఈ రైలుకు ‘నమో గ్రీన్ రైల్’ అని పేరు పెట్టారు. జూలై 17, 2026న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రైలును ప్రారంభించారు. ఈ రైలు దేశంలో పర్యావరణ హిత రవాణా వ్యవస్థలో ఓ కీలక ముందుగా మోదీ అభివర్ణించారు. ఈ రైలు మొత్తం 89 కిలోమీటర్ల దూరాన్ని సుమారు రెండు గంటల్లో పూర్తి చేస్తుంది. గంటకు గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. జింద్ నుంచి సోనిపట్ వరకు ప్రయాణించే సమయంలో మొత్తం 12 స్టేషన్లలో ఆగుతుంది. ప్రయాణికులకు సాధారణ రైలు సేవలతో పాటు పర్యావరణానికి అనుకూలమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా ఈ రైలును అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఈ రైలు ఉదయం 7:40 గంటలకు జింద్ జంక్షన్ నుంచి బయలుదేరి ఉదయం 9:40 గంటలకు సోనిపట్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఉదయం 10:40 గంటలకు సోనిపట్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు జింద్ జంక్షన్కు చేరుకుంటుంది. త్వరలోనే మరికొన్ని ప్రాంతాల్లో కూడా హైడ్రోజన్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని భారతీయ రైల్వే ప్రయత్నిస్తోంది.
Read Also: రైల్వే స్టేషన్ లో చిప్స్ ప్యాకెట్స్ ఎత్తు కెళ్లిన ప్రయాణికులు.. ఏం చిల్లర గాళ్లు ఉన్నారేంట్రా మీరూ?