E-Paper
Advertisement

హైడ్రోజన్ రైలుపై రాళ్లు విసిరారా? వైరల్ వీడియోపై రైల్వే క్లారిటీ!

హైడ్రోజన్ రైలుపై రాళ్లు విసిరారా? వైరల్ వీడియోపై రైల్వే క్లారిటీ!
Advertisement

Hydrogen Train Viral Video Explained: ఇండియన్ ఫస్ట్ హైడ్రోజన్ రైలు రీసెంట్ గా పట్టాలెక్కింది. ప్రధాని మోడీ ఈ రైలును అట్టహాసంగా ప్రారంభించారు. అయితే, తాజాగా ఈ రైలుపై కొందరు దుండగులు రాళ్లు విసురుతున్నట్లు కనిపించే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చాలా మంది ఈ వీడియో చూసి నిజంగానే హైడ్రోజన్ రైలుపై దాడి జరిగిందా? అని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా భారతీయ రైల్వే ఈ వైరల్ వీడియోపై క్లారిటీ ఇచ్చింది.

దాడి గురించి రైల్వే ఏం చెప్పిందంటే?

తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోకు హైడ్రోజన్ రైలుతో ఎలాంటి సంబంధం లేదని రైల్వే అధికారులు వెల్లడించారు. ఆ వీడియో పాతదని, అందులో కనిపిస్తున్నది హైడ్రోజన్ రైలు కాదని స్పష్టం చేశారు. వీడియోను కొత్త హైడ్రోజన్ రైలుకు సంబంధించినదిగా ప్రచారం చేయడం పూర్తిగా తప్పుదోవ పట్టించే ప్రయత్నమని తెలిపారు. నార్తర్న్ రైల్వే తన అధికారిక ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. వైరల్ వీడియోలో కనిపిస్తున్న రైలును WAG-12 లోకోమోటివ్ లాగుతున్నట్లు గుర్తించినట్లు తెలిపింది. అందువల్ల ఆ ఘటనను హైడ్రోజన్ రైలుతో లింక్ చేయడం కరెక్ట్ కాదని వెల్లడించింది. హైడ్రోజన్ రైలు ఎలాంటి అంతరాయం లేకుండా తన షెడ్యూల్ ప్రకారమే నడుస్తోందని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వీడియోను నిజమని నమ్మకుండా, అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ప్రజలకు సూచించింది. అదే సమయంలో ప్రయాణికులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది.

Advertisement

భారతీయ తొలి హైడ్రోజన్ రైలు గురించి..

ఇండియన్ ఫస్ట్ హైడ్రోజన్ రైలు హర్యానాలోని జింద్ జంక్షన్ నుంచి సోనిపట్ వరకు నడుస్తోంది. ఈ రైలుకు ‘నమో గ్రీన్ రైల్’ అని పేరు పెట్టారు. జూలై 17, 2026న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రైలును ప్రారంభించారు. ఈ రైలు దేశంలో పర్యావరణ హిత రవాణా వ్యవస్థలో ఓ కీలక ముందుగా మోదీ అభివర్ణించారు. ఈ రైలు మొత్తం 89 కిలోమీటర్ల దూరాన్ని సుమారు రెండు గంటల్లో పూర్తి చేస్తుంది. గంటకు గరిష్టంగా 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. జింద్ నుంచి సోనిపట్ వరకు ప్రయాణించే సమయంలో మొత్తం 12 స్టేషన్లలో ఆగుతుంది. ప్రయాణికులకు సాధారణ రైలు సేవలతో పాటు పర్యావరణానికి అనుకూలమైన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా ఈ రైలును అందుబాటులోకి తీసుకొచ్చారు.

హైడ్రోజన్ ట్రైన్ టైమింగ్స్

Advertisement

ఈ రైలు ఉదయం 7:40 గంటలకు జింద్ జంక్షన్ నుంచి బయలుదేరి ఉదయం 9:40 గంటలకు సోనిపట్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఉదయం 10:40 గంటలకు సోనిపట్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు జింద్ జంక్షన్‌కు చేరుకుంటుంది. త్వరలోనే మరికొన్ని ప్రాంతాల్లో కూడా హైడ్రోజన్ రైళ్లను అందుబాటులోకి తీసుకురావాలని భారతీయ రైల్వే ప్రయత్నిస్తోంది.

Read Also: రైల్వే స్టేషన్ లో చిప్స్ ప్యాకెట్స్ ఎత్తు కెళ్లిన ప్రయాణికులు.. ఏం చిల్లర గాళ్లు ఉన్నారేంట్రా మీరూ?

Related News

మొబైల్ నెంబర్‌లో ఒక్క అంకె తప్పు, కన్ఫార్మ్‌డ్ టికెట్ ఉన్నా.. రైలు నుంచి గెంటివేత, చివరికి..

ఇండిగో విమానానికి ప్రమాదం.. శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ఘటన

రైలు సీటులో కూర్చొనే ముందు జాగ్రత్త.. భయంతో వణికిపోతున్న ప్రయాణికుడు

లేడీస్ డ్రైవ్ చేస్తారు.. లేడీసే ప్రయాణిస్తారు.. హైదరాబాద్‌లో ర్యాపిడో అదిరిపోయే Pink Bike సర్వీస్!

తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లే రైళ్ల వేళలు మార్పు.. చెక్ చేసుకోపోతే ఇక అంతే!

వందే భారత్ రైళ్లలో రొటేటింగ్ సీట్లు తొలగింపు? ఈ 3 సమస్యలే కారణమట!

వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 250కి పైగా వందే భారత్ స్లీపర్ రైళ్లు వచ్చేస్తున్నాయ్!

Big Stories

Advertisement
×