E-Paper
Advertisement

Patna Accident: బీహార్‌లో ఘోర ప్రమాదం.. చిన్నారి సహా ఏడుగురు మృతి..

Patna Accident: బీహార్‌లో ఘోర ప్రమాదం.. చిన్నారి సహా ఏడుగురు మృతి..
Advertisement

Road Accident In Patna: బీహార్ రాష్ట్రంలో అత్యంత విషాద ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో చిన్నారి సహా ఏడుగురు మృత్యువాతపడ్డారు. అందులో ఓ మహిళ కూడా ఉంది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. బీహార్ రాజధాని పాట్నాలో మెట్రో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అయితే, మంగళవారం న్యూ బైపాస్ ప్రాంతంలోని రామ్ లఖాన్ మార్గంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆటుగా వెళ్తున్న ఆటో.. మెట్రో క్రేన్ ను ఢీకొట్టింది.

ఆటోలో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతిచెందారు. ప్రమాద సమయంలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మరో నలుగురు మృతిచెందారు. మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే, ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలతో బయపడ్డారు. అతను మోతీహరి నివాసీగా గుర్తించారు. అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Also Read: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

అయితే, స్థానికులు భారీగా అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు. మెట్రో నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, పనివేళల్లో క్రేన్ చుట్టూ గార్డ్స్ గానీ,సైన్ బోర్డ్స్ గానీ, అడ్డుగా పరదాలుగానీ చుట్టలేదని.. ఈ కారణంగా ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.

Tags

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×