E-Paper
Advertisement

Students: తీవ్ర విషాదం.. ఐదుగురు విద్యార్థులు మృతి

Students: తీవ్ర విషాదం.. ఐదుగురు విద్యార్థులు మృతి
Advertisement

5 Medical Students died: వాళల్లంతా వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు. అయితే, ఓ వివాహానికి హాజరయ్యారు. ఆ తరువాత పక్కనే ఉన్న సముద్రపు ఒడ్డున కాసేపు ఎంజాయ్ చేద్దామనుకున్నారు. కానీ, వారి ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. సముద్ర తీరానికి వెళ్లిన కొద్దిసేపటికే అల రూపంలో వారిని మృత్యువు కబలించింది. దీంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చిలోని ఓ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్న ఐదుగురు విద్యార్థులు, వీరితోపాటు మరో ఏడుగురు స్నేహితులు కలిసి నాగర్ కోవిల్ లో జరిగిన ఓ పెళ్లి కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ తరువాత సోమవారం ఉదయం అక్కడి నుండి లేమూర్ సముద్ర తీరానికి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. ఆ సమయంలో అనుకోకుండా ఓ పెద్ద అల వచ్చి వారిని సముద్రంలోకి ఈడ్చుకెళ్లింది.

Advertisement

ఈ ప్రమాదంలో ఐదుగురు మెడికల్ విద్యార్థులు మృతిచెందారు. మరో ముగ్గురు స్నేహితులు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసి విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. చదువు కోసం వెళ్లిన తమ పిల్లలు అనుకోని ప్రమాదంలో చిక్కి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో తీవ్రంగా విలపిస్తున్నారు.

Also Read: రాజస్థాన్ లో రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

Advertisement

అయితే, అంతకుముందు రోజు ముగ్గురు వ్యక్తులు కూడా ఇదేమాదిరిగా నీటిలో మునిగిపోయి మృతిచెందారని, రెండురోజుల్లోనే మొత్తం 8 మంది మృతిచెందినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సంబంధిత అధికారులు ఇందుకు సంబంధించిన చర్యలు తీసుకున్నారని.. బీచ్ మూసివేసి, అక్కడికి ఎవరూ రాకుండా హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

Tags

Related News

పిల్లలపై లాఠీఛార్జ్ ఘోరం.. ధర్మేంద్ర ప్రధాన్ ముందే రేణుకా చౌదరి నిరసన

పిల్లలను రెచ్చగొట్టొద్దు..లీక్ ఘోర పాపం, నీట్‌పై నోరు విప్పిన ప్రధాని మోదీ

పాపం ఊరికే పోదు.. నీట్ లీక్ వెనకున్న వారిని వదిలేదే లేదు: ప్రధాని మోదీ

హస్తిన వైపు కదం తొక్కిన రైతన్నలు.. శంభు బార్డర్ వద్ద హైటెన్షన్, అడ్డుకున్న పోలీసు బలగాలు, ఎందుకు?

పని లేదు.. సగం జీతమే ఇవ్వండి: IAS లేఖ

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

Big Stories

Advertisement
×