E-Paper
Advertisement

Road Accident : రాజస్థాన్ లో రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి

Road Accident : రాజస్థాన్ లో రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
Advertisement

Road Accident In Rajasthan: రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సవాయ్ మధోపూర్ హైవేపై కారును గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందగా..మరో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి.

ఆలయ దర్శనానికి  ఓ కుటుంబం కారులో వెళ్తున్న సమయంలో సవాయ్ మాధోపూర్ హైవేపై ఆకస్మాత్తుగా వచ్చిన  గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటన ఢిల్లీ -ముంబై హైవేపై ఆదివారం జరగగా..కారు పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదంలో ఒకే కుటంబానికి చెందిన ఆరుగురు మృతి చెందగా..ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి.

Advertisement

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు జైపూర్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత మృతదేహాలను బయటకు తీయడం కోసం చాలా శ్రమించాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు.

Also Read: పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. విదేశాల నుంచి మెయిల్స్..!

Advertisement

మృతుల బంధువులకు పోలీసులు సమాచారం అందించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. ఈ ప్రమాదంలో మనీష్ శర్మ, అతని భార్య అనిత, కైలాష్ శర్మ, అతని భార్య సంతోష, సతీష్ శర్మ , పూనమ్ లతో సహా ఆరుగురు మృతి చెందినట్లు బోన్లీ పోలీస్ అధికారులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందా? లేక ఏదైనా భారీ వాహనం ఢీ కొట్టిందా.. అన్న కోణంలో విచారిస్తున్నట్లు వెల్లడించారు.

Tags

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×