Madhya Pradesh News: అసలే అమ్మాయిలు దొరక్క దేశంలో పెళ్లికాని ప్రసాదుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చాలామంది లవ్ మ్యారేజ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇలా చేయడం చాలామందికి నచ్చలేదు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు అలా చేయడంతో తట్టుకోలేకపోయాడు ఓ తండ్రి. చివరకు తన కూతురు చనిపోయిందని భావించి అంత్యక్రియులు నిర్వహించాడు. సంచలనం రేపిన ఈ ఘటన మధ్యప్రదేశ్లో వెలుగుచూసింది. అసలు మేటరేంటి?
మధ్యప్రదేశ్లో దారుణం..
మధ్యప్రదేశ్ విదిశ పరిధిలోని చునావాలి గలి ప్రాంతంలో ఊహించని ఘటన జరిగింది. ఆ ప్రాంతానికి కుష్వాహా కుటుంబానికి చెందిన 23 ఏళ్ల కూతురు కవిత బాగానే చదువుకుంది. ఆ సమయంలో ఓ వ్యక్తిని ప్రేమించింది. అయితే అబ్బాయి వేరే కమ్యూనిటీకి చెందినవాడు. ఈ విషయం ఇంట్లో వారికి తెలిస్తే తన ప్రేమను అంగీకరించరు.. చివరకు వివాహం చేయరని భావించింది.
ఈ నేపథ్యంలో మూడురోజుల కిందట ఇంట్లో నుంచి పారిపోయింది. కోరుకున్న ప్రియుడ్ని వివాహం చేసుకుంది. ఉన్నట్లుండి కవిత ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలి పోవడంతో కుష్వాహా కుటుంబసభ్యులు షాకయ్యారు. కూతురు కోసం సమీప ప్రాంతాలలో బంధువులతో కలిసి వెతికారు. కానీ అమ్మాయి గురించి ఎలాంటి సమాచారం తెలియలేదు.
బతికుండగానే కూతురికి అంత్యక్రియలు
కొన్నిరోజుల తర్వాత ప్రేమికుడ్ని రహస్యంగా పెళ్లి చేసుకుందని కుటుంబానికి తెలిసింది. ఈ విషయం తెలియగానే కుష్వాహా కుటుంబ సభ్యులు షాకయ్యారు. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతులు ఇలా చేస్తుందని జీర్ణించుకోలేకపోయారు. ఇరుగుపొరుగువారు, కులాల వారు చీటి పోటి మాటలకు తట్టుకోలేకపోయారు. దీన్ని తట్టుకోలేక ఇంట్లో బయట తాళం వేసి లోపల ఉండే పరిస్థితి నెలకొంది.
చివరకు ఈ విషయం తెలిసిన తర్వాత బంధువులు.. కుష్వాహా కుటుంబసభ్యులను సంప్రదించారు. వారిని ఓదార్చడానికి ప్రయత్నించారు. దీన్ని నుంచి బయటపడేందుకు కుష్వాహా ఫ్యామిలీ ఓ నిర్ణయం తీసుకుంది. దీనిపై బంధువులతో మాట్లాడింది. వేరే కులం వాడ్ని పెళ్లి చేసుకుందన్న కారణంతో కవిత మరణించిందని భావించి, కూతురుకి అంత్యక్రియలు నిర్వహించారు.
శుక్రవారం కుష్వాహా కుటుంబం బంధువులు, కమ్యూనిటీ సభ్యులతో సమావేశమయ్యారు. పిండితో కూతురు దిష్టిబొమ్మని తయారు చేశారు. ఆ తర్వాత అలంకరించి సంగీతం, ఉత్సవ ఏర్పాట్లతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. విదిషలోని అనేక కూడళ్లు గుండా ఈ తతంగం జరిగింది. కుటుంబ సభ్యులు, స్థానికులు దిష్టిబొమ్మను తమ భుజాలపై మోసుకెళ్లారు.
ALSO READ: రైలులో టికెట్ లేకుండా 300 మంది ప్రయాణికులు, అధికారుల తనిఖీలతో పరుగో పరుగు
శ్మశానానికి చేరుకున్న తర్వాత కుటుంబ సభ్యులు దిష్టిబొమ్మ చితికి నిప్పు పెట్టారు. శాస్త్రోక్తంగా పిండప్రదానం, అంత్యక్రియలు నిర్వహించారు. దీనిపై కవిత సోదరుడు రాజేష్ కుష్వాహా మాట్లాడాడు. ఆడపిల్ల కావడంతో అల్లారుముద్దుగా కుటుంబం పెంచిందని, గొప్ప ఆశయాలతో చదివించారని తెలిపాడు.
కుటుంబాన్ని విడిచిపెట్టి వారి కలలను చెదరగొట్టిందని అన్నాడు. కవిత తండ్రి రాంబాబు కుష్వాహా కంటతడి పెట్టారు. తన కూతురు నిర్ణయంతో ఫ్యామిలీ పూర్తిగా విచ్ఛిన్నమైందని, తన జీవితంలో అత్యంత బాధాకరమైన క్షణంగా ఆయన అభివర్ణించాడు.
ప్రేమ పెళ్లి చేసుకున్న కూతురు.. అంత్యక్రియలు చేసిన తండ్రి!
మధ్యప్రదేశ్లోని విదిశాలో చోటు చేసుకున్న ఘటన
తన కూతురు ప్రేమ వివాహం చేసుకుందన్న ఆవేదనతో అంత్యక్రియలు నిర్వహించిన తండ్రి
కొన్ని రోజులుగా తమ కూతురు కనిపించడం లేదని ఫిర్యాదు చేయగా.. విచారణలో ఆమె ఓ యువకుడిని ప్రేమ వివాహం… pic.twitter.com/cgZM26CIma
— BIG TV Breaking News (@bigtvtelugu) December 22, 2025