E-Paper
Advertisement

​​Jharkhand Encounter: జార్ఖండ్‌‌లో భారీ ఎన్‌ కౌంటర్.. మృతుల్లో కీలక నేతలు, ముమ్మరంగా గాలింపు

​​Jharkhand Encounter: జార్ఖండ్‌‌లో భారీ ఎన్‌ కౌంటర్.. మృతుల్లో కీలక నేతలు, ముమ్మరంగా గాలింపు

​​Jharkhand Encounter: మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఈ ఏడాది మార్చి నాటికి మావోయిస్టుల రహిత దేశంగా చేయాలని భావిస్తోంది కేంద్రం. అందుకు సంబంధించి వేగంగా అడుగులు వేస్తోంది.  తాజాగా గురువారం ఉదయం జార్ఖండ్‌లో భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో అనేక మంది మావోలు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి. మృతుల్లో అగ్రనేతలు ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

జార్ఖండ్‌‌లో భారీ ఎన్‌‌కౌంటర్

గురువారం ఉదయం జార్ఖండ్‌లోని భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. పశ్చిమ సింగ్భూం జిల్లాలోని సారండా అడవుల ప్రాంతంలో భద్రతా బలగాలు-మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు జరిగాయి. ఇప్పటివరకు 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. అయితే ఇంకా కాల్పులు జరుగుతున్నట్లు పోలీసు వర్గాలు మీడియాకు తెలిపాయి.

మావోయిస్టు పెద్ద ఎత్తున దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు అక్కడి పరిసరాలను బట్టి అనుమానిస్తున్నాయి బలగాలు.  భారీ సంఖ్యలో సమావేశమైనట్టు పోలీసులకు సమాచారం రావడంతో రాష్ట్ర-కేంద్ర బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. ఎన్‌కౌంటర్ ముగిసిన తర్వాత పూర్తి సమాచారాన్ని అందిస్తామని జార్ఖండ్ పోలీసు ప్రధాన కార్యాలయం పేర్కొంది.

అనేక మంది మావోయిస్టులు మృతి.. వారిలో కీలక నేతలు

జార్ఖండ్‌ను నక్సలైట్ రహిత రాష్ట్రంగా మార్చడానికి సారందా అటవీ ప్రాంతం అతిపెద్ద అడ్డంగా మారిందని చెబుతున్నారు. ఈ ప్రాంతం మావోయిస్టు కీలక నేత మిసిర్ బెస్రా చేతిలో ఉందని పోలీసు నివేదికలు సూచిస్తున్నాయి. అతడి తలపై కోటి రూపాయల బహుమతి ఉంది. మరి ఈ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన కీలక నేతలు ఎవరు అనేది ఇంకా తెలియాల్సివుంది.

మావోల నుంచి కాల్పులు ఆగడంతో గాలింపు ముమ్మరం చేశారు.  లభ్యమైన మావోల మృతదేహాలను ఒకచోటుకు చేర్చుతున్నారు.  ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.  దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సివుంది.

ALSO READ: సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. 65 రోజుల వైవాహిక బంధానికి 13 ఏళ్ల న్యాయపోరాటం తర్వాత 

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×