Helicopter Services: మేడారం సమ్మక్క- సారలమ్మ మహా జాతరను పురస్కరించుకుని భక్తుల కోసం ప్రభుత్వం, పర్యాటన శాఖ ప్రత్యేకంగా హెలికాప్టర్ సర్వీసులను అందుబాటులోకి తీసుకువచ్చాయి. పర్యాటన రంగం అభివృద్ధి, భక్తులకు జాతరను సరికొత్త కోణంలో చూసే అవకాశం కల్పించడమే లక్ష్యంగా ఈ సేవలు నేటి నుండి ప్రారంభమయ్యాయి.
జాతర రద్దీని దృష్టిలో ఉంచుకుని.. భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడంతో పాటు ఆకాశం నుండి జాతరను వీక్షించేందుకు అధికారులు పడిగాపూర్ వద్ద ప్రత్యేక హెలిప్యాడెన్ ఏర్పాటు చేశారు. ఈ సేవలు ఈ నెల 31 వరకు ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 5.20 గంటల వరకు భక్తులకు అందుబాటులో ఉంటాయి.
పడిగాపూర్ లేదా ఎలుబాక ప్రాంతం నుండి మేడారం జాతరను ఆకాశం నుండి 6నుంచి7 నిమిషాల పాటు వీక్షించవచ్చు. దీనికి ఒక్కోక్కరికి రూ.4800 ఛార్జ్ చేస్తున్నారు. హనుమకొండ నుంచి నేరుగా మేడారం చేరుకుని, తిరిగి వచ్చే ప్రయాణానికి ఒక్కొక్కిరికి రూ. 35,999 ఛార్జ్ నిర్ణయించారు.
లక్షలాది మంది భక్తులతో కిక్కిరిసిపోయే మేడారం పరిసరాలను, గద్దెల ప్రాంతాన్ని , దట్టమైన అటవీ ప్రాంతాన్ని ఆకాశం నుండి చూడటం భక్తులకు ఒక మధురానుభూతిని మిగులుస్తుంది. అత్యవసర పరిస్థితిల్లో మెడికల్ సర్వీసుల కోసం కూడా ఈ హెలికాప్టర్ సేవలను వినియోగించుకునే అవకాశం ఉంది.
సాధారణ భక్తులకు ఈ ధరలు కొంత భారంగా అనిపించినప్పటికీ.. సమయం ఆదా చేసుకోవాలనుకునే వారికి, జాతర అందాలను విహంగ వీక్షణం చేయాలనుకునే వారికి ఇది ఒక గొప్ప అవకాశం.
ALSO READ: బైక్ను ఢీకొన్న కారు.. స్పాట్లోనే ఇద్దరు స్నేహితుల మృతి
మేడారం జాతరలో హెలికాప్టర్ రైడ్స్ షురూ
మేడారం వచ్చే భక్తులకు ఈరోజు నుంచి అందుబాటులోకి రానున్న హెలికాప్టర్ రైడ్స్
పడిగాపూర్ వద్ద హెలిప్యాడ్ ఏర్పాటు
6-7 నిమిషాల పాటు జాతర విహంగ వీక్షణ జాయ్ రైడ్ కు ఒక్కొక్కరికి రూ.48,00 ఛార్జ్
హనుమకొండ నుండి మేడారం జాతర వీక్షణం అప్ డౌన్ కు… pic.twitter.com/jT9MqXTPYJ
— BIG TV Breaking News (@bigtvtelugu) January 22, 2026