BigTV English

Earthquake: మహారాష్ట్ర, అరుణాచల్ లో వరుస భూకంపాలు.. భయంతో జనం పరుగులు

Earthquake: మహారాష్ట్ర, అరుణాచల్ లో వరుస భూకంపాలు.. భయంతో జనం పరుగులు
Earthquake Hits Maharashtra Arunachal Pradesh
 

Earthquake Hits Maharashtra Arunachal Pradesh: మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్ లోని గురువారం తెల్లవారుజామున వరుస భూకంపాలు వణికించాయి. మహారాష్ట్రలోని నాందేండ్ లో కేవలం నిమిషాల వ్యవధిలోనే ప్రకంపనలు జరిగినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం మహారాష్ట్ర లోని హింగోలి నగరంలో గుగువారం ఉదయం పది నిముషాల వ్యవధిలో ఉదయం 6గంటల 8నిముషాలకు భూకంపం సంభవించింది.


ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.2 గా నమోదైంది. ఆ తర్వాత మళ్లీ 6:19 గంటలకు రెండో సారి భూమి కంపించింది. అప్పుడు రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 3.6 గా నమోదైనట్లు సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించారు.

Also Read: సెల్ఫీలు దిగేవారికి షాకిచ్చిన రైల్వేశాఖ.. అలా చేస్తే జరిమానా, జైలుశిక్ష ఖాయం..


భూమికి 10 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైనట్లు తెలిపింది. ఈ భూప్రకంపనల వల్లన ఎలాంటి ఆస్తి నష్టం కాని, ప్రాణ నష్టం కానీ జరిగినట్లు ఎటువంటి సమాచారం లేదు. మహారాష్ట్ర కంటే ముందే అరుణాచల్ ప్రదేశ్ లో గురువారం ఉదయం రెండుసార్లు భూకంపం సంభవించింది.

సెంటర్ ఫర్ సిస్మోలజీ వివరించిన వివరాల ప్రకారం తెల్లవారుజామున 01:49 గంటల సమయంలో 3.7 తీవ్రతతో భూమి కంపించింది. రెండవ భూకంపం 03:40 సమయంలో రిక్టర్ స్కేలుపై 3.4గా భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఇది అరుణాచల్ ప్రదేశ్ లోని తూర్పు కమెంగ్ లో జరిగింది.

Related News

Indian Air Force: పాకిస్తాన్ ని ఇలా చావుదెబ్బ కొట్టాం.. ఆపరేషన్ సిందూర్ అరుదైన వీడియో

New House To MPs: ఎంపీలకు 184 కొత్త ఇళ్లను ప్రారంభించిన పీఎం.. ఈ 5 బెడ్ రూమ్ ఫ్లాట్స్ ప్రత్యేకతలు ఇవే

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Big Stories

×