BigTV English

Arvind Kejriwal to Supreme Court: బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే.. సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్..

Arvind Kejriwal to Supreme Court: బెయిల్‌పై ఢిల్లీ హైకోర్టు స్టే.. సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్..

Arvind Kejriwal Moves Supreme Court in Delhi Liquor Scam Bail: ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణానికి సంబంధించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులో అరవింద్ కేజ్రీవాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తనకు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు మధ్యంతర స్టే విధించడాన్ని సవాల్ చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారం ఉదయం విచారణ చేపట్టాలని ఢిల్లీ సీఎం తరపు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు.


మార్చి 21న ఈడీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే గత గురువారం ట్రయల్ కోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆప్ కార్యకర్తలు, నేతలు శుక్రవారం కేజ్రీవాల్ విడుదలవుతారని భావించారు. కానీ అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. శుక్రవారం ఉదయమే దర్యాప్తు సంస్థ ఈడీ ట్రయిల్ కోర్టు ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఢిల్లీ హైకోర్టు ట్రయిల్ కోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది.

ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ తన పిటిషన్‌లో, దేశంలో స్థిరపడిన న్యాయ ప్రక్రియ, సంప్రదాయాన్ని విస్మరిస్తూ బెయిల్ ఆర్డర్‌పై హైకోర్టు స్టే విధించిందని పేర్కొన్నారు. ఈ విషయంలో, దేశంలోని న్యాయం, బెయిల్ ప్రాథమిక సూత్రాలు ఉల్లంఘించారంటూ పేర్కొన్నారు. కేంద్రంలోని అధికార పార్టీని విమర్శించే వ్యక్తిగా ఉండటం వల్ల ఈడీ అసంతృప్తికి, వివక్షపూరిత ప్రక్రియకు తాను బలి అయ్యానని రాజకీయ కోణాన్ని కూడా పిటిషన్‌లో పేర్కొన్నారు.


Also Read: సీఎం కేజ్రీవాల్‌కు షాకిచ్చిన ఢిల్లీ హైకోర్టు

దిగువ కోర్టు ఆదేశాలను సమీక్షించేటప్పుడు హైకోర్టు కూడా నిర్లక్ష్యం చేసిందని తెలిపారు. ఢిల్లీ హైకోర్టు తీర్పు ఒక్కరోజు కూడా నిర్వహణలో ఉండటానికి వీళ్లేదని.. ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశం. కాబట్టి, కేజ్రీవాల్‌ను వెంటనే విడుదల చేయాలని ఆదేశించాలంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు.

Related News

CBSE 10th And 12th Exams: సీబీఎస్ఈ 10, 12వ తరగతుల బోర్డ్ ఎగ్జామ్స్ షెడ్యూల్ వచ్చేసింది

Medical Seats Hike: దేశ వ్యాప్తంగా 10 వేల మెడికల్ సీట్ల పెంపు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Railway Employees Bonus: రైల్వే ఉద్యోగులకు గుడ్ న్యూస్.. 78 రోజుల పండుగ బోనస్ ప్రకటించిన కేంద్రం

Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి

JammuKashmir News: లడక్‌కు రాష్ట్ర హోదా కోసం ఆందోళనలు.. బీజేపీ ఆఫీసుకు నిప్పు

UP News: విద్యా అధికారిని కొట్టిన హెచ్ఎం.. 5 సెకన్లలో 4 సార్లు బెల్టుతో ఎడాపెడా, ఆపై సస్పెండ్

Maoists: ఆపరేషన్ కగార్ తర్వాత ఏం జరుగుతోంది..? ముఖ్యంగా తెలుగు వారిపైనే స్పెషల్ ఫోకస్..!

High Court: భర్త సెకండ్ సెటప్‌పై భార్య దావా వేయొచ్చు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు, ఆటగాళ్లు ఇది మీ కోసమే!

Big Stories

×