E-Paper
Advertisement

Hyderabad: హైదరాబాద్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్.. ఒకరు డాక్టర్

Hyderabad: హైదరాబాద్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. ముగ్గురు ఉగ్రవాదుల అరెస్ట్.. ఒకరు డాక్టర్
Advertisement

Hyderabad: దేశవ్యాప్తంగా ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్న భారీ కుట్రను గుజరాత్ యాంటీ-టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) భగ్నం చేసింది. గత సంవత్సర కాలంగా నిఘా పెట్టిన ఏటీఎస్ అధికారులు, ఆయుధాలు సరఫరా చేస్తున్న ముగ్గురు ఉగ్రవాదులను హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. వీరిలో ఒకరు రాజేంద్రనగర్‌కు చెందిన డాక్టర్ కావడం కలకలం రేపుతోంది. అరెస్టయిన ముగ్గురినీ గుజరాత్ పోలీసులు అహ్మదాబాద్‌కు తరలించారు.

అరెస్టయిన వారిలో ప్రధాన నిందితుడు రాజేంద్రనగర్ పరిధిలోని ఫోర్ట్ వ్యూ కాలనీకి చెందిన సయ్యద్ అహ్మద్ మొహియుద్దీన్‌గా గుర్తించారు. మొహియుద్దీన్ ఉన్నత విద్యావంతుడు కావడం, ఫ్రాన్స్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేయడం అధికారులను విస్మయానికి గురిచేసింది. ఇతను నిషేధిత ఉగ్రవాద సంస్థ ఐఎస్‌కేపీ (ISKP) సభ్యులతో టెలిగ్రామ్ యాప్ ద్వారా నిరంతరం సంబంధాలు కొనసాగిస్తున్నట్లు ఏటీఎస్ దర్యాప్తులో వెల్లడైంది.

Advertisement

మొహియుద్దీన్ నివాసంపై గుజరాత్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో అతని వద్ద నుంచి 2 గ్లాక్ పిస్టల్స్, 1 బెరెట్టా పిస్టల్, 30 లైవ్ కాట్రిడ్జ్‌లు (తూటాలు) స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, ఈ నెల 18వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Read Also: Medak District: దారుణం.. రెండు నెలల కూతురిని ట్రాక్టర్ టైర్ల కింద పడేసిన కసాయి తల్లి

Advertisement

ఈ ముగ్గురూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీ ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్నట్లు యాంటి టెర్రరిస్ట్ పోలీసులు గుర్తించారు. గతంలో హైదరాబాద్‌లోని గోకుల్ చాట్, లుంబినీ పార్క్, దిల్‌సుఖ్‌నగర్ వంటి ప్రాంతాల్లో జరిగిన బాంబు దాడుల తరహాలోనే, దేశవ్యాప్తంగా పలు నగరాల్లో దాడులు చేయాలని వీరు ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, జమ్మూ కాశ్మీర్‌లోని పెహల్గాం వంటి యాత్రికులపై జరిగిన దాడుల తరహాలో దాడులకు సిద్ధమైనట్లు సమాచారం.

గతంలో దేశంలో ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా, దాని మూలాలు హైదరాబాద్ పాతబస్తీలో ఉండేవనే వాదన ఉండేదని, తాజా ఘటన ఆ వాదనను గుర్తుచేస్తోంది.  అరెస్టయిన ముగ్గురినీ ప్రస్తుతం గుజరాత్‌లో విచారిస్తున్నారు. వీరి వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు. ఎక్కడెక్కడ దాడులకు ప్లాన్ చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని జైషే మహమ్మద్, లష్కరే తొయిబా వంటి సంస్థలతో వీరికి సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో ఏటీఎస్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

Related News

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

Big Stories

Advertisement
×