E-Paper
Advertisement

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. వందల ఇళ్లు మంటల్లో పూర్తిగా ధ్వంసం

Fire Accident: శుక్రవారం రాత్రి ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలోని రిథాల మెట్రో స్టేషన్ సమీపంలోని బెంగాలీ బస్తి అనే స్లమ్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం గురించి రాత్రి 10:56 గంటల సమయంలో ఢిల్లీ అగ్నిమాపక సేవల శాఖకు సమాచారం అందింది. అగ్నిప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో, తక్షణమే 15 అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. తర్వాత మంటలు ఎక్కువగా విస్తరించే ప్రమాదం ఉండటంతో మరో 14 యంత్రాలు కూడా చేరాయి.. దీంతో మొత్తం 29 యంత్రాలు పనిచేశాయి. అగ్నిమాపక సిబ్బంది ఆరు గంటల పాటు కష్టపడి, శనివారం తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో అగ్నిని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు.

అయితే ఈ ప్రాంతం రిథాల మెట్రో స్టేషన్ సమీపంలోని ఒక దట్టమైన స్లమ్ క్లస్టర్, ఇక్కడ వందలాది మంది కూలీలు, పేదలు తాత్కాలిక గుడిసెలు నిర్మించుకుని నివసిస్తున్నారు. అయితే ప్రస్తుతం అగ్ని వేగంగా వ్యాపించడానికి కారణం, ప్రమాద స్థలంలో ఉన్న అనేక LPG సిలిండర్లు కారణమంటున్నారు. ఈ పేలుళ్లు అగ్నిని మరింత తీవ్రతరం చేసి, పొగలు దట్టంగా ఏర్పడటానికి, నివాసుల్లో భయం వ్యాపించడానికి దారితీశాయి. నివాసులు తమ వస్తువులు కాపాడుకునేందుకు, భద్రతయుతంగా తరలి వెళ్లేందుకు గందరగోళంగా పరిగెత్తారు.

ఈ ఘటనలో ఒకరు మరణించారు. మృతుడు మున్నా(30)గా గుర్తించారు. అయితే ఈ వ్యక్తి శవం ఆహార గుడిసెలో కనిపెట్టారు. ఇక ఒక 5 ఏళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు, అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి తరలించబడ్డాడు. బాలుడి పరిస్థితి స్థిరంగా ఉందని, మరిన్ని మరణాలు లేదా గాయాలు రిపోర్ట్ కాలేదని అధికారులు తెలిపారు. ఢిల్లీ పోలీసులు ఘటన స్థలాంలో ఎక్కువగా జనాలు సమీపించకుండా చూస్తున్నారు.

Also Read: శంషాబాద్‌‌లో విమానాల రాకపోకలు ఆలస్యం.. 200 మంది ప్రయాణికులు రాత్రంతా పడిగాపులు 

ఈ ఘటనలో ప్రాణ నష్టం తక్కువగా సంభవించిని ఆస్తి నష్టం భారీగా జరిగింది. 500 గుడిసెల వరకు పూర్తిగా ధ్వంసమయ్యాయి, ఇందులో వందలాది కుటుంబాలు తమ ఇళ్లు, సామానులు కోల్పోయారు. ఈ ప్రాంతంలో నివసిస్తున్నవారు ఎక్కువగా బెంగాలీ మూలాల కార్మికులు, వారి ఆర్థిక ఇబ్బందులు మరింత పెరిగాయి. అగ్నిప్రమాద కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు, కానీ LPG సిలిండర్ల పేలుళ్లు ముఖ్య కారణంగా చెబుతున్నారు.

Related News

రేపు ఆ ప్రాంతాల్లో మోదీ పర్యటన.. ఏకంగా రూ.21 వేల కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం.. పూర్తి వివరాలివే!

బెంగాల్‌లో దారుణమైన బీజేపీ పాలన.. అనాగరికం, రాక్షసం-ఎంపీ అభిషేక్ బెనర్జీ

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

Big Stories

×