E-Paper
Advertisement

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ

Vandemataram 150 Years: వందేమాతరం కోట్ల మంది భారతీయులకు స్ఫూర్తి.. భవిష్యత్తుకు సరికొత్త భరోసా: ప్రధాని మోదీ
Advertisement

Vandemataram 150 Years: ‘వందేమాతరం’ కోసం తమ జీవితాలను అంకితం చేసిన లక్షలాది మంది మహానుభావులకు, భారతమాత బిడ్డలకు ఈ రోజు గౌరవపూర్వకంగా నివాళులర్పిస్తున్నానని ప్రధాని మోదీ అన్నారు. వందేమాతరం సామూహికంగా పాడటమనేది మాటలలో చెప్పలేని అనుభవం అన్నారు. ఒక లయ, ఒక స్వరం, ఒక భావోద్వేగం, ఉత్సాహం హృదయాన్ని కదిలిస్తుందన్నారు. శుక్రవారం దిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్‌ స్టేడియంలో వందేమాతరం 150వ స్మారకోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర ఉద్యమంలో కోట్ల మంది భారతీయుల్లో ‘వందేమాతరం’ గేయం స్ఫూర్తి నింపిందన్నారు. వందేమాతరం గేయానికి శుక్రవారంతో 150 ఏళ్లు పూర్తయ్యాయని గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. వందేమాతరం గేయాన్ని నవంబర్ 7, 1875న బంకించంద్ర ఛటర్జీ రచించారు.

‘నవంబర్ 7, నిజంగా చారిత్రాత్మకమైన రోజు. ఇవాళ మనం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. ఈ రోజు మనకు కొత్త స్ఫూర్తినిస్తుంది. లక్షలాది మంది భారతీయులలో నూతన శక్తిని నింపుతుంది. ‘వందేమాతరం’ కోసం తమ జీవితాలను అంకితం చేసిన లక్షలాది మంది మహానుభావులకు, భారతమాత బిడ్డలకు నేను గౌరవపూర్వకంగా నివాళులర్పిస్తున్నాను. వందేమాతరం కోసం అంకితం చేసిన ప్రత్యేక నాణెం, పోస్టల్ స్టాంప్ ను విడుదల చేశాను’- ప్రధాని మోదీ

ఇది భారతదేశ శతాబ్దం

Advertisement

‘వందేమాతరం ప్రతి యుగంలో, ప్రతి కాలంలో సందర్భాన్ని బట్టి ఉపయోగకరంగా మారింది. ఈ గేయం అమరత్వాన్ని పొందింది. చాలా మంది విప్లవకారులు, ఉరికొయ్యలపై నిలబడి వందేమాతరం అన్నారు. ఈ శతాబ్దాన్ని భారతదేశ శతాబ్దంగా మార్చుకోవాలి. అందుకు తగిన సామర్థ్యం 1.4 బిలియన్ల భారతీయులలో ఉంది’ – ప్రధాని మోదీ

వందేమాతరం గేయం ఒక స్వప్నం, ఒక సంకల్పం, ఒక మంత్రం అని ప్రధాని మోదీ అన్నారు. ఈ గేయం దేశమాత ఆరాధన, సాధన అని పేర్కొన్నారు. వందేమాతరం మనందరినీ పురాణ ఇతిహాసాల్లోకి తీసుకెళ్తుందన్నారు. వందేమాతరం శబ్దం ఆత్మవిశ్వాసాన్ని నింపుతోందని, భవిష్యత్తుకు సరికొత్త భరోసా ఇస్తుందన్నారు.

Advertisement

Also Read: Supreme Court On Street Dogs: వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. స్కూళ్లు, రైల్వే స్టేషన్లకు 8 వారాల్లోగా ఫెన్సింగ్

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×