E-Paper
Advertisement

Delhi: కాలుష్యం ఎఫెక్ట్.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఢిల్లీ విద్యార్థులకు పండగే పండుగ

Delhi: కాలుష్యం ఎఫెక్ట్.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఢిల్లీ విద్యార్థులకు పండగే పండుగ
Advertisement

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో విషపూరితంగా మారుతున్న గాలి కాలుష్యం.. ఇప్పటికే కాలుష్యంతో సతమతమవుతున్న ప్రజలకు.. ఇప్పుడు చలి కూడా తోడైంది. రాత్రి, తెల్లవారుజామున దట్టమైన పొగమంచు వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. ఇది ఊహించిన దానికంటే చాలా ముందు సమయం అంటున్నారు అధికారులు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. ఈసారి రికార్డ్‌ స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం కనిపిస్తోందని చెబుతున్నారు.

Advertisement

ఢిల్లీ ప్రాంతంలో వాయు కాలుష్యం మరింత తీవ్రమవుతోంది. నవంబర్ 11న ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 425కి చేరడంతో కాలుష్యం తీవ్రమైన స్థాయికి చేరింది. అయితే ఇది ప్రధానంగా పొగమంచు, స్థిరమైన వాతావరణం, పొక్క మండడం, వాహనాల నుంచి ఉద్గారంచే విషవాయువులు, నిర్మాణాలు వంటి కారణాల వల్లే జరిగిందని చెబుతున్నారు. SAFAR ప్రకారం, ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో AQI 400 పైనే ఉంది. ఇది పిల్లలు, వృద్ధులు, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారికి తీవ్రమైన ప్రమాదంగా మారుతుందని తెలిపారు. ప్రజలు ఈ విష వాయువులు పీల్చడం వల్ల అస్థమా, శ్వాసకోశ సమస్యలు, గుండె జబ్బులు పెరుగుతున్నాయి.

Also Read: తెలుగు రాష్ట్రాల్లో చంపేస్తున్న చలి.. ఈ జిల్లాల్లో సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు

Advertisement

దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ 1 నుంచి 5వ తరగతి వరకు అన్ని పాఠశాలల్లో ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాకుండా అన్ని పాఠశాలల వారు తల్లిదండ్రులకు వెంటనే సమాచారం అందించాలన్నారు. ఢిల్లీ చీఫ్ మినిస్టర్ రేఖా గుప్తా ఈ నిర్ణయాన్ని “పిల్లల భద్రతకు ప్రాధాన్యత”గా పేర్కొంది. ఈ నిర్ణయంతో వాహనాలు తగ్గే అవకాశం ఉందని.. దీంతో కాలుష్యం తగ్గుతుందని సూచించింది. కానీ కొందరు తల్లిదండ్రులు చిన్న పిల్లలకు మాత్రమే కాకుండా హై స్కూల్ విద్యార్థులకు కూడా ఆన్‌లైన్ క్లాసులు పెట్టాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా రేఖా గుప్తా ప్రజలు మాస్కులు ధరించడం, ఇంట్లోనే ఉండటం, బయటి ఆహారం తగ్గించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×