Tamil Nadu BJP MP Candidates List: లోక్సభ ఎన్నికల కోసం తమిళనాడులో తొమ్మిది మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితాను బీజేపీ గురువారం విడుదల చేసింది.
తమిళనాడు బీజేపీ చీఫ్ కె.అన్నామలై కోయంబత్తూరు నుంచి, తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెన్నై (సౌత్), కేంద్రమంత్రి ఎల్.మురుగన్ నీలగిరి నుంచి, నైనార్ నాగేంద్రన్ తిరునల్వేలి నుంచి పోటీ చేయనున్నారు. ఈ జాబితాలో రాధాకృష్ణన్, టీఆర్ పరివేందర్, నరసింహన్, ఏసీ షణ్ముగం కూడా ఉన్నారు.
ఇక రాధాకృష్ణన్ కన్యాకుమారి నుంచి, నాగేంద్రన్ తూత్తుకుడి నుంచి, టీఆర్ పరివేందర్ పెరంబళూర్ నుంచి, కృష్ణగిరి నుంచి సి. నరసింహన్ పోటీ చేయనున్నారు. వెల్లూరు బరిలో ఏసీ షణ్ముగం ఉన్నారు.
ఇటీవలే తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్ పదవికి రాజీనామా చేసిన అనంతరం తమిళిసై సౌందర రాజన్ సొంత గూటికి చేరుకున్నారు. ముందుగా అనుకున్నట్లే చెన్నై సౌత్ నుంచి ఆమె లోక్ సభ ఎన్నికల బరిలో ఉండనున్నారు.
The Central Election Committee of the Bharatiya Janata Party has decided the following names for the ensuing General Elections to the Lok Sabha. Here is the third list. pic.twitter.com/5beaatODJh
— BJP (@BJP4India) March 21, 2024