E-Paper
Advertisement

BJP Election Incharges : 4 రాష్ట్రాలకు ఎన్నికల ఇన్ఛార్జులను నియమించిన బీజేపీ

BJP Election Incharges : 4 రాష్ట్రాలకు ఎన్నికల ఇన్ఛార్జులను నియమించిన బీజేపీ
Advertisement

BJP Appointed Incharges to Four States : బీజేపీ అధిష్ఠానం నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల ఇన్ఛార్జులను నియమించింది. నలుగురు కేంద్రమంత్రుల్ని నాలుగు రాష్ట్రాలకు ఇన్ఛార్జులుగా నియమిస్తూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు.

జమ్ముకశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని, మహారాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జిగా కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్, మహారాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జిగా కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్, హర్యానా ఎన్నికల ఇన్ఛార్జిగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేవ్ లను నియమించింది. అలాగే.. ఝార్ఖండ్ కు శివరాజ్ సింగ్ చౌహాన్, హిమంత బిశ్వా శర్మలను నియమించింది.

Advertisement

ఇటీవలే కేంద్రంలో మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరింది. ముచ్చటగా మూడోసారి ప్రధాని నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం చేసి.. బాధ్యతలు స్వీకరించారు. లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ.. ఇప్పుడు మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిసారించింది. జమ్ముకశ్మీర్, ఝార్ఖండ్, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ అధిష్టానం ఎన్నికల ఇన్ఛార్జులను నియమించింది.

Related News

ఆసుపత్రి నుంచే సోనమ్ వాంగ్‌చుక్ సంచలన లేఖ.. ఢిల్లీ హైకోర్టులో ఊరట దక్కకపోవడంతో కీలక మలుపు!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×