E-Paper
Advertisement

BJP Election Incharges : 4 రాష్ట్రాలకు ఎన్నికల ఇన్ఛార్జులను నియమించిన బీజేపీ

BJP Election Incharges : 4 రాష్ట్రాలకు ఎన్నికల ఇన్ఛార్జులను నియమించిన బీజేపీ

BJP Appointed Incharges to Four States : బీజేపీ అధిష్ఠానం నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల ఇన్ఛార్జులను నియమించింది. నలుగురు కేంద్రమంత్రుల్ని నాలుగు రాష్ట్రాలకు ఇన్ఛార్జులుగా నియమిస్తూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు.

జమ్ముకశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని, మహారాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జిగా కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్, మహారాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జిగా కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్, హర్యానా ఎన్నికల ఇన్ఛార్జిగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్, త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేవ్ లను నియమించింది. అలాగే.. ఝార్ఖండ్ కు శివరాజ్ సింగ్ చౌహాన్, హిమంత బిశ్వా శర్మలను నియమించింది.

ఇటీవలే కేంద్రంలో మూడోసారి ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరింది. ముచ్చటగా మూడోసారి ప్రధాని నరేంద్రమోదీ ప్రమాణ స్వీకారం చేసి.. బాధ్యతలు స్వీకరించారు. లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ.. ఇప్పుడు మరో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిసారించింది. జమ్ముకశ్మీర్, ఝార్ఖండ్, మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ అధిష్టానం ఎన్నికల ఇన్ఛార్జులను నియమించింది.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×