BigTV English

Arunachal Pradesh: ఆ రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ

Arunachal Pradesh: ఆ రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ

Arunachal Pradesh: ఈశాన్య రాష్ట్రమైనటువంటి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీకి అధిక సీట్లు వచ్చాయి. దీంతో భారతీయ జనతా పార్టీ ముచ్చటగా మూడోసారి ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఆ రాష్ట్రంలో మొత్తం అసెంబ్లీ స్థానాలు 60. అందులో మూడింట రెండొంతులకు పైగా స్థానాలను బీజేపీ గెలుచుకుంది. దీంతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. జాతీయ అగ్రనేతలు కూడా రాష్ట్ర నేతలకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్న రెండు లోక్ సభ స్థానాలు కూడా తమవేనంటూ బీజేపీ సీఎం పెమా ఖండూ, సీనియర్ నేతలు ధీమాను వ్యక్తం చేస్తున్నారు.


కాగా, దేశంలో 2024 లోక్ సభ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగగా, ఇందుకు సంబంధించిన ఫలితాలు జూన్ 4న విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశముంది.. ఏ పార్టీ అధికారంలోకి రాబోతున్నది అంటూ తెలుసుకునేందుకు ఆసక్తిగా ఉన్నారు.

Also Read: మోదీ మూడో సారి గెలిస్తే గుండు చేయించుకుంటా: సోమనాథ్


అయితే, ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు పలు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తమ పార్టీకే ఎక్కువ సీట్లు వస్తాయి.. దీంతో తామే అధికారంలోకి రాబోతున్నామంటూ ధీమాను వ్యక్తం చేశారు. ఇటు ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదలయ్యాయి. అందులో మాత్రం బీజేపీకి ఎక్కువగా మొగ్గు చూపాయి. వీటిపై స్పందించిన పలువురు నేతలు ఆ ఎగ్జిట్ పోల్స్ సరికావు.. అంతా అబద్ధమంటూ కొట్టిపారేశారు.

Tags

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×