E-Paper
Advertisement

Somnath Bharti: మోదీ మూడో సారి గెలిస్తే గుండు చేయించుకుంటా: సోమనాథ్

Somnath Bharti: మోదీ మూడో సారి గెలిస్తే గుండు చేయించుకుంటా: సోమనాథ్
Advertisement

Somnath Bharti: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచి అధికారంలోకి వస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పని ఆమ్ ఆద్మీ పార్టీ నేత సోమనాథ్ తెలిపారు. ఒకవేళ మోదీ మూడోసారి ప్రధాని అయితే తాను గుండు చేయించుకుంటానని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని తెలిపిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పని సోమనాథ్ అన్నారు.

ఢిల్లీలోని 7 సీట్లను కూడా ఆప్ కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నా మాటలు గుర్తు ఉంచుకోండి.. మోదీ మరోసారి ప్రధాని అయితే నేను గుండు చేసుకుంటా.. అన్ని ఎగ్జిట్ పోల్స్ తప్పని జూన్ 4న రుజువు అవుతుందని సోమనాథ్ చెప్పారు. ఢిల్లీ ఎంపీ స్థానంలో బీజేపీ అభ్యర్థి బన్సూరి స్వరాజ్‌పై సోమనాథ్ పోటీ చేశారు.

Advertisement

Also Read: ఈవీఎంలను మార్చేందుకు కుట్ర.. అందుకే ఫేక్ ఎగ్జిట్ పోల్స్: కేజ్రీవాల్

దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏ కూటమి విజయాన్ని సాధిస్తుందని తెలిపాయి. అయితే వీటిని ఆప్ నేత సోమనాథ్ అంగీకరించలేదు. ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తప్పని రుజువు అవుతుందని అన్నారు.  ఢిల్లీ నియోజకవర్గంలో బీజేపీకి చెందిన బన్సూరీ స్వరాజ్ పై సోమనాథ్ పోటీ చేశారు. కేంద్ర మంత్రి సుష్మ స్వరాజ్ కుమార్తె.. బన్సూరీ స్వరాజ్ తొలిసారి ఎన్నికల బరిలో దిగారు. ఢిల్లీలోని ఏడు స్థానాలు ఇండియా కూటమి దక్కించుకుంటుందని సోమనాథ్ ఎక్స్‌లో పోస్టు చేశారు.

Advertisement

లోక్ సభ ఎన్నికల్లో భారీ మెజారిటీతొ బీజేపీ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఆ పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి 350కి పైగా స్థానాలు వస్తాయని చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. ప్రతిపక్ష పార్టీలతో కూటమిలో ఉన్న ఇండియా కూటమి 150- 170 సీట్లకు పరిమితం అవుతుందని అంచనా వేశాయి.

Tags

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×