E-Paper
Advertisement

Patna Boat Capsize: గంగా నదిలో పడవ బోల్తా.. ఆరుగురు గల్లంతు..

Patna Boat Capsize: గంగా నదిలో పడవ బోల్తా.. ఆరుగురు గల్లంతు..
Advertisement

Boat Capsize in Patna: బీహార్‌లోని పాట్నాలో విషాదం చోటుచేసుకుంది. రాజధాని నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న బార్హ్ పట్టణ సమీపంలోని గంగా నదిలో పడవ బోల్తా పడింది. మొత్తం 17 మంది ఈ పడవలో ప్రయాణిస్తుండగా పడవ బోల్తా పడింది.

దీంతో అందులోని 11 మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. మిగిలిన ఆరుగురు గల్లంతైనట్లు సమాచారం. బార్హ్ ఉమానాథ్ ఘాట్ నుండి డయారాకు ప్రయాణిస్తోన్న సమయంలో పడవ బోల్తా పడిందని గల్తంతైన వారికోసం అన్వేషణ జరుగుతోందని అధికారులు తెలిపారు.

Advertisement

గత నెల ప్రారంభంలో బీహార్‌లోని మహావీర్ తోలా గ్రామ సమీపంలో గంగా నదిలో పడవ బోల్తా పడి ఇద్దరు వ్యక్తులు అదృశ్యమైన తర్వాత ఆదివారం ఈ సంఘటన జరిగింది.

Advertisement

ఉమానాథ్ గంగా ఘాట్ సమీపంలో ఉదయం 9.15 గంటలకు ఒకే కుటుంబానికి చెందిన 17 మంది ప్రయాణిస్తున్న పడవ మార్గమధ్యంలో బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగిందని బార్హ్ సబ్ డివిజనల్ ఆఫీసర్ శుభం కుమార్ తెలిపారు.

సమాచారం అందుకున్న జిల్లా యంత్రాంగం, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్‌లు ప్రారంభించి, బోటులో గల్లంతైన వారి ఆచూకీని కనిపెట్టినట్లు ఎస్‌డీఎం తెలిపారు.

Tags

Related News

ఆసుపత్రి నుంచే సోనమ్ వాంగ్‌చుక్ సంచలన లేఖ.. ఢిల్లీ హైకోర్టు షాకింగ్ తీర్పుతో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×