BigTV English

Patna Boat Capsize: గంగా నదిలో పడవ బోల్తా.. ఆరుగురు గల్లంతు..

Patna Boat Capsize: గంగా నదిలో పడవ బోల్తా.. ఆరుగురు గల్లంతు..

Boat Capsize in Patna: బీహార్‌లోని పాట్నాలో విషాదం చోటుచేసుకుంది. రాజధాని నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న బార్హ్ పట్టణ సమీపంలోని గంగా నదిలో పడవ బోల్తా పడింది. మొత్తం 17 మంది ఈ పడవలో ప్రయాణిస్తుండగా పడవ బోల్తా పడింది.


దీంతో అందులోని 11 మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. మిగిలిన ఆరుగురు గల్లంతైనట్లు సమాచారం. బార్హ్ ఉమానాథ్ ఘాట్ నుండి డయారాకు ప్రయాణిస్తోన్న సమయంలో పడవ బోల్తా పడిందని గల్తంతైన వారికోసం అన్వేషణ జరుగుతోందని అధికారులు తెలిపారు.

గత నెల ప్రారంభంలో బీహార్‌లోని మహావీర్ తోలా గ్రామ సమీపంలో గంగా నదిలో పడవ బోల్తా పడి ఇద్దరు వ్యక్తులు అదృశ్యమైన తర్వాత ఆదివారం ఈ సంఘటన జరిగింది.

ఉమానాథ్ గంగా ఘాట్ సమీపంలో ఉదయం 9.15 గంటలకు ఒకే కుటుంబానికి చెందిన 17 మంది ప్రయాణిస్తున్న పడవ మార్గమధ్యంలో బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగిందని బార్హ్ సబ్ డివిజనల్ ఆఫీసర్ శుభం కుమార్ తెలిపారు.

సమాచారం అందుకున్న జిల్లా యంత్రాంగం, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్‌లు ప్రారంభించి, బోటులో గల్లంతైన వారి ఆచూకీని కనిపెట్టినట్లు ఎస్‌డీఎం తెలిపారు.

Tags

Related News

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Big Stories

×