Cabinet approves ₹24,420 crore fertilizer subsidy for kharif season: ఢిల్లీలో కొనసాగుతున్న రైతుల నిరసనల మధ్య రైతులకు సబ్సిడీ పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాబోయే ఖరీఫ్ సీజన్ లో ఎరువులపై పోషక – ఆధారిత సబ్సిడి (NBS) రేట్లను నిర్ణయించడానికి NBS పథకం క్రింద 3 కొత్త ఎరువుల గ్రేడ్ లను ఖరీఫ్ సీజన్ 2024 (ఏప్రిల్ 1 నుంచి సెప్టంబర్ 30) వరకు ఎరువులపై రూ. 24,420 కోట్ల రాయితీని ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
రైతులు ఎప్పటిలాగే రూ. 1350 ధరకే 50 కిలోల డీఏపీని పొందవచ్చని వెల్లడించింది. ముఖ్యంగా ఈ పథకం రైతులకు తక్కువ ధరకు లభ్యమయ్యేలా చూస్తుందని కేంద్ర మంత్రివర్గం గురువారం అధికార ప్రకటనలో తెలిపింది. అలాగే దేశంలో కొత్తగా మరో మూడు సెమీ కండక్టర్ల తయారీ యూనిట్ స్థాపనకు కేబినేట్ ఆమోదముద్ర వేసింది.
Read more: సోలార్ ప్యానళ్ల ఏర్పాటుకు భారీ సబ్సిడీ.. పీఎం సూర్యఘర్ స్కీమ్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్..
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రివర్గం ఒక ప్రకటనలో వెల్లడించింది. టాటా గ్రూప్, జపాన్ కి చెందిన రెసినస్ వంటి కంపెనీలు కలిసి రూ. 1,26 లక్షల కోట్ల పెట్టుబడితో ఈ మూడు యూనిట్లు కలిసి ఏర్పాటు చేయనున్నాయి. ఆటో ముబైల్, టెలికమ్యూనికేషన్, రక్షణ వంటి రంగాలకు అవసరమైన సెమీ కండక్టర్లను తయారు చేస్తారు.
రాయల్టిరేటు స్పెసిఫికేషన్ ఆమోదం లభించడం వల్ల దేశంలో తొలిసారిగా ఈ 12 ఖనిజాల బ్లాకులను వేలం వేయడానికి కేంద్రం వీలు కల్పిస్తుంది. ఖనిజాలపై రాయల్టి రేటు అనేది బ్లాకుల వేలంలో బిడ్డర్లకు ముఖ్యమైన ఆర్ధికపరమైన అంశంపై కూడా కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.