E-Paper
Advertisement

Smriti Irani Nomination: నేడు నామినేషన్ దాఖలు చేయనున్న స్మృతి ఇరానీ

Smriti Irani Nomination: నేడు నామినేషన్ దాఖలు చేయనున్న స్మృతి ఇరానీ
Advertisement

Smriti Irani Nomination Details: ఉత్తర ప్రదేశ్ లోని అమేథీ లోక్ సభ నియోజకవర్గం ఈసారి చాలా కీలకంగా మారింది. ఈసారి ఎలాగైనా ఈ స్థానంలో విజయం సాధించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. ఇటు బీజేపీ కూడా ఈ స్థానాన్ని మళ్లీ నిలబెట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. అయితే, నేడు కేంద్రమంత్రి స్మతి ఇరానీ నామినేషన్ దాఖలు చేయనున్నారు. అంతకంటే ముందుగా ఆమె అయోధ్యలోని రామ్ లల్లాను దర్శించుకోనున్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా నియోజకవర్గానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేయనున్నారు.

అయితే, అమేథీలో మే 20న ఐదో దశలో ఓటింగ్ జరగనున్నది. ఈ నెల 26న అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ కు మే 3 చివరి తేదిగా ఉంది. అయితే, కాంగ్రెస్ ఇంకా తన అభ్యర్థిని ప్రకటించలేదు. ఈసారి ఎలాగైనా ఇక్కడి నుంచి విజయం సాధించాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపికలో చాలా లోతుగా ఆలోచన చేస్తుంది. అయితే, ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు టికెట్ ఇవ్వనున్నదని ప్రచారం జరిగింది. మరోవైపు రాహుల్ గాంధీయే ఇక్కడి నుంచి పోటీ చేస్తారని ఆహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Also Read: ప్రధాని హోదాలో మోదీ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు: ప్రియాంక గాంధీ

నువ్వా నేనా అన్నట్లుగా పోటీకి సై అంటున్న కాంగ్రెస్, బీజేపీ ఎలాగైనా విజయం సాధించాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అమేథీ లోక్ సభ స్థానం చాలా కీలకంగా మారింది.

Related News

హస్తిన వైపు కదం తొక్కిన రైతన్నలు.. శంభు బార్డర్ వద్ద హైటెన్షన్, అడ్డుకున్న పోలీసు బలగాలు, ఎందుకు?

పని లేదు.. సగం జీతమే ఇవ్వండి: IAS లేఖ

ప్రియుడిని చంపి, మృతదేహాన్ని కట్ చేసి సంచిలో పెట్టి, ఇంటి యజమానికి వాయిస్ ద్వారా

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

Big Stories

Advertisement
×