Smriti Irani Nomination Details: ఉత్తర ప్రదేశ్ లోని అమేథీ లోక్ సభ నియోజకవర్గం ఈసారి చాలా కీలకంగా మారింది. ఈసారి ఎలాగైనా ఈ స్థానంలో విజయం సాధించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. ఇటు బీజేపీ కూడా ఈ స్థానాన్ని మళ్లీ నిలబెట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. అయితే, నేడు కేంద్రమంత్రి స్మతి ఇరానీ నామినేషన్ దాఖలు చేయనున్నారు. అంతకంటే ముందుగా ఆమె అయోధ్యలోని రామ్ లల్లాను దర్శించుకోనున్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా నియోజకవర్గానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేయనున్నారు.
అయితే, అమేథీలో మే 20న ఐదో దశలో ఓటింగ్ జరగనున్నది. ఈ నెల 26న అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ కు మే 3 చివరి తేదిగా ఉంది. అయితే, కాంగ్రెస్ ఇంకా తన అభ్యర్థిని ప్రకటించలేదు. ఈసారి ఎలాగైనా ఇక్కడి నుంచి విజయం సాధించాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపికలో చాలా లోతుగా ఆలోచన చేస్తుంది. అయితే, ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు టికెట్ ఇవ్వనున్నదని ప్రచారం జరిగింది. మరోవైపు రాహుల్ గాంధీయే ఇక్కడి నుంచి పోటీ చేస్తారని ఆహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.
Also Read: ప్రధాని హోదాలో మోదీ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు: ప్రియాంక గాంధీ
నువ్వా నేనా అన్నట్లుగా పోటీకి సై అంటున్న కాంగ్రెస్, బీజేపీ ఎలాగైనా విజయం సాధించాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే అమేథీ లోక్ సభ స్థానం చాలా కీలకంగా మారింది.