E-Paper
Advertisement

Priyanka Gandhi: ప్రధాని హోదాలో మోదీ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు: ప్రియాంక గాంధీ

Priyanka Gandhi: ప్రధాని హోదాలో మోదీ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు: ప్రియాంక గాంధీ
Advertisement

Priyanka Gandhi: ప్రధాని మోదీపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ విమర్శలు గుప్పించారు. మరో సారి మోదీ అధికారంలోకి వస్తే దేశ రాజ్యాంగాన్ని మార్చేస్తారని ఆరోపించారు. శనివారం గుజరాత్‌ లోని వల్సాద్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళల నగలు, మంగళసూత్రం దొంగిలించి వేరొకరికి ఇస్తారని మోదీ అంకుల్ చెప్పే అవకాశం ఉందని ఎద్దేవా చేశారు.

రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో మోదీ కాంగ్రెస్ పై చేసిన ఆరోపణలకు గానూ ప్రియాంక గాంధీ కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోదీని బీజేపీ నేతలు శక్తివంతుడని పొగుడుతున్నారని అన్నారు. మోదీ చిటికె వేస్తే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆగి పోతుందంటున్నారు..అలాంటప్పుడు మోదీ దేశ పేదరికాన్ని ఎందుకు తొలగించ లేకపోతున్నారని ప్రశ్నించారు. ప్రధాని హోదాలో మోదీ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు.

Advertisement

Also Read:ఎన్నికల వేళ సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రియాంకా గాంధీ భర్త

తాము అధికారంలోకి వస్తే రాజ్యాంగంలో కీలక మార్పులు చేస్తామని బీజేపీ నేతలే స్వయంగా చెప్తున్నారని అన్నారు. దేశంలో నిత్యావసరాల ధరల పెరుగుదలకు కారణం మోదీ పరిపాలనా వైఫల్యం అని ఆరోపించారు. కేవలం సార్వత్రిక ఎన్నికల కోసమే ప్రధాని సిలిండర్ల ధరలను తగ్గించారని తెలిపారు. మోదీకి ప్రజలపై ఎలాంటి సానుభూతి లేదని విమర్శించారు.

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×